పాఠశాలకు పెద్ద కత్తి, చాకుతో వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు, పిల్లలు బెంబేలు, వీడియో
పాఠశాలకు ఉపాధ్యాయులు పుస్తకాలను పట్టుకుని చదువు చెప్పేందుకు వస్తుంటారు కదా. ఇది అంతా చూసేదే. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తళతళ మెరిసిపోతున్న పెద్ద కత్తితో పాటు ఒక చాకును తీసుకుని వచ్చింది. వీటిని చూసిన పిల్లలు బెంబేలెత్తిపోయారు. స్కూలు పక్కనే వున్న పలువురు పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు.
దీనితో పోలీసులు, విద్యాధికారులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆమెను బైటకు పిలిచి వాటిని ఎందుకు తీసుకుని వచ్చారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం. దీనితో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐతే మతిస్థిమితం లేని ఆమెను పాఠశాలకు వచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఎలా అంగీకరించారన్నది చర్చనీయాంశంగా మారింది.
कौशांबी में सरकारी स्कूल की हेडमास्टर शिखा सिंह हाथों में चाकू और चापड़ लेकर स्कूल पहुंच गईं. अभिभावकों की शिकायत पर पुलिस और शिक्षा विभाग के अधिकारी मौके पर पहुंचे. जांच में परिवार ने उनकी मानसिक स्थिति ठीक न होने की बात कही है. बीएसए ने निलंबन और कानूनी कार्रवाई की बात कही है.… pic.twitter.com/68Vz5mVPMN
— NDTV India (@ndtvindia) July 18, 2026
