నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలామందికి అలవాటుగా వుంటుంది. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము.ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది.కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరం, అక్కయ్య పాళెం పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ నెల 3వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను ఎన్.టి.ఏ రద్దు చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని తరిమివేస్తాం, దాని కోసం యుద్ధం చేస్తున్నామంటూ TVK పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాఖ్యానించడంపై భాజపా నాయకుడు కె. అన్నామలై తీవ్రంగా తప్పుబట్టారు. ఇవే మాటలను ఎన్నికల పర్యటనల సమయంలో చెప్పి గెలిచి రావాల్సింది, సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని అన్నందుకే ప్రజలు DMK పార్టీని గద్దె నుంచి దింపేసారని అన్నామలై అన్నారు. ఆయన మాట్లాడుతూ... శాసనసభలో సనాతన హిందూ ధర్మాన్ని నిర్మూలించడం గురించి డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన కొద్ది రోజులకే, టీవీకే ఎమ్మెల్యే వి.ఎం.ఎస్. ముస్తఫా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ తపాలా కార్యాలయ వ్యవస్థ కేవలం మరో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కనిపించవచ్చు. కానీ అమరావతికి, ఇలాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దీని ప్రాముఖ్యత కేవలం రూ.103 కోట్ల భవనానికో లేదా తపాలా శాఖ సౌకర్యానికో పరిమితం కాదు. రాజధాని ప్రాంతంలో సంస్థల క్రమమైన విస్తరణే అంతకంటే ముఖ్యం. అమరావతికి చేర్చబడిన ప్రతి శాఖ, కార్యాలయం-పరిపాలనా వ్యవస్థ, ఒక క్రియాశీలక రాజధాని నగరంగా దాని దీర్ఘకాలిక గుర్తింపును బలపరుస్తుంది.
2024 ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ప్రధాన వ్యక్తులలో ఒకరు కొడాలి నాని. ఈయన చంద్రబాబు నాయుడుపైనా, మొత్తం టీడీపీ వ్యవస్థపైనా అనవసరంగా, తీవ్రమైన భాషలో విమర్శలు గుప్పించేవారు. కొడాలి నాని చేసిన ఆ అదుపులేని వ్యాఖ్యలన్నీ చివరికి ప్రజల దృష్టిలో వైసీపీ ప్రతిష్టనే దెబ్బతీశాయి. అయితే, 2024లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొడాలి నాని కొంతకాలం పాటు మౌనంగానే ఉన్నారు. ఆయన బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం కూడా చాలా అరుదైపోయింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా ప్రమోషనల్ క్యాంపెయిన్ను టీమ్ ప్రారంభించింది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా మధ్యప్రాశ్చంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు విశేష ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇంధన ఆదా కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.
చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులే అడ్డం తిరిగి అడ్డగోలుగా లంచాలు బొక్కేస్తూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసు స్టేషనులో ఇలాగే దొరికిపోయారు అక్కడి ఎస్సై, కానిస్టేబుల్. అసలు విషయం ఏంటంటే... ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నది.ఈ క్రమంలో వారు ఎస్సైను సంప్రదించగా.. ఆయన న్యాయం చేయాల్సింది పోయి వారిని బెదిరించి తనకు రూ. 70 వేలు లంచం ఇస్తే సరే లేదంటే వ్యవహారం మరోలా వుంటుందని అన్నట్లు సమాచారం. దానితో ఆ జంట ఏసిబి అధికారులను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
తెలంగాణలో కష్టాల్లో ఉన్న సింగిల్-స్క్రీన్ థియేటర్లను కాపాడటానికి, స్థిర అద్దెల నుండి శాతం ఆధారిత ఆదాయ పంపిణీకి మారాలని డిమాండ్ చేస్తున్న సునీల్ నారంగ్ వంటి ఎగ్జిబిటర్లను నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎగతాళి చేశారు. ఒక టీవీ చర్చలో నారంగ్ ఎదురుదాడి చేస్తూ, వంశీ పేరు ప్రస్తావించకుండా ఆయన శరీరాన్ని కించపరిచేలా విమర్శించారు.
B2K విశ్లేషణ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అరుదైన భూమి మూలకాల(REE) నిల్వల్లో సుమారు 8 శాతం వాటాతో భారతదేశం మూడవ అతిపెద్ద నిల్వలను కలిగి ఉంది. అయినప్పటికీ, 2022 నుంచి 2025 మధ్యకాలంలో భారత్ తన REE అవసరాల్లో విలువ పరంగా 60-80% మరియు పరిమాణ పరంగా 85-90% వరకు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది దేశంలో సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ విదేశాలపై ఆధారపడటం ఇంకా కొనసాగుతున్నదాన్ని స్పష్టంగా చూపిస్తోంది.అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అంచనా ప్రకారం, భారతదేశంలో 13.15 మిలియన్ టన్నుల మొనాజైట్ నిల్వలు ఉన్నాయి.
వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వదలా' సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్.
తెలంగాణతో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో, మే 30 నుండి దశలవారీగా ఓటర్ల జాబితాల 'ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు కానున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అక్కడ సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) కార్యక్రమ షెడ్యూల్ను తదనంతరం ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
‘కెడి: ది డెవిల్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా మొత్తం థియేటర్ను షేక్ చేసేలా ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజిల్స్ వేయించే సీన్లు, అదిరిపోయే యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, కళ్లుచెదిరే విజువల్స్తో ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా, ఈ ప్రభాదం భారత్పై మరింత ఎక్కవగా ఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. ఇపుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ పొదుపు మంత్రం పఠిస్తున్నారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో, గత కొద్ది రోజులుగా ఈ రహదారి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల క్రితమే, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు యువకులు ఇదే రహదారిపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.ప్రస్తుతం ఒక కుటుంబం ఈ రహదారిపై అత్యంత ప్రమాదకరమైన రీతిలో ప్రయాణించడంతో కూడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన రీసెంట్ హిట్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ ('ఇష్టంగా' ఫేమ్) విలన్గా మెప్పించారు. 'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
జీ5 ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డిఫరెంట్ వెబ్ సిరీస్తో ఆడియెన్స్ను అలరించటానికి సిద్ధమైంది. అదే ‘‘మేము‘కాప్’లం’’. కొన్నాళ్ల నుంచి ఈ సిరీస్ టైటిల్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్పై మరింత ఆసక్తిని పెంచేలా ‘‘మేము‘కాప్’లం’’ ట్రైలర్ను విడుదల చేశారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడి పొదుపు చర్యలను చేపట్టాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను తగ్గించారు. కేవలం 2 కార్లను ఉపయోగిస్తున్నారు. ఇదే బాటలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పయనిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ద్విచక్రవాహనంపై విధాన సభకు వచ్చారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 4 కార్లను మాత్రమే వాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తన కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను కుదించాలని అధికారులకు సూచించారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. తాజాగా ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నారు. గతంలో 12 వాహనాలతో ఉండే కాన్వాయ్ ఇపుడు కేవలం నాలుగు వాహనాలకే పరిమితం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసిన చేయడంతో పాటు బుధవారం ఆయన కేవలం నాలుగు వాహనాల వాహనశ్రేణితోనే సచివాలయానికి వచ్చారు.
వ్యాపారవేత్తగా ప్రారంభమై నిర్మాతగా మారిన కావ్య, ఆంధ్రప్రదేశ్లోనే భారీ స్థాయిలో తెలుగు, పాన్-ఇండియా చిత్రాలను నిర్మించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ స్థాయి సినీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పారడాక్స్ పిక్చర్స్ రూపొందించిన దీర్ఘకాలిక విజన్ను మంత్రికి వివరించారు. ఈ విజన్లో భాగంగా, అమితాబ్ బచ్చన్ నటించిన సర్కార్ 3, అక్కినేని నాగార్జున నటించిన ఆఫీసర్, అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టీ చిత్రాలకు రచయితగా పనిచేసిన పి. జయకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ పాన్-ఇండియా చిత్ర వివరాలను ఆమె పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం అమరావతికి తిరిగి వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. తదుపరి సమస్యలను నివారించడానికి తక్షణ చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "ఏదైనా సాధ్యమే". ఈ సినిమాకు దైవం తోడుంటే.. అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాల్గొన్నారు.
జన నాయగన్ నిర్మాతకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి పిలుపువచ్చింది. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లిన జన నాయగన్ చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణను హుటాహుటి బయలుదేరి చెన్నైకు రావాలని సీఎం విజయ్ కోరారు.
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభులు నిర్మించార. ఈ నెల 14వ తేదీ గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. దీంతో సినిమాను విడుదల చేయలేకపోయారు.
వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి వెనుక ఆమె హస్తమున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని ఎదుర్కోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేస్తుందని టీఎంసీ నేతలు అంటున్నారు.
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాలతో పాటు వీడీ సతీశన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఉత్కంఠత మధ్య కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ను ఏఐసీసీ అధిష్టానం ఎంపికచేసింది.
అమీర్ ఖాన్ నిర్మించిన చిత్రం ఏక్ దిన్, ఇందులో ఆయన కుమారుడు జునైద్ ఖాన్ సాయి పల్లవితో కలిసి నటించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. థియేటర్లలో కనీసం ఒక్క రోజు కూడా నిలదొక్కుకోలేకపోయింది. ఈ సినిమాతో సాయి పల్లవి హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసింది. ఆసక్తికరంగా, సినిమా విడుదలకు ముందే, ఆ పాత్రకు తాను సరిపోలేదని ఆమె అంగీకరించినట్లు సమాచారం. శర్వానంద్తో కలిసి ఆమె నటించిన గత తెలుగు చిత్రం పడి పడి లేచే మనసుకు, ఏక్ దిన్కు మధ్య సారూప్యతలు ఉన్నాయని చాలామంది ఎత్తి చూపారు. దీనివల్ల ఈ జంట, వారి కథాంశం ప్రేక్షకులకు అంత కొత్తగా అనిపించలేదు.
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదనీ, దాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటించారు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నట్లుగా టీవీకే పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీలో సనాతన ధర్మంపై జరుగుతున్న తాజా రాజకీయ చర్చలో భాగంగా, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన ఎమ్మెల్యే విఎంఎస్ ముస్తఫా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి(Eradicate) అని చేసిన వ్యాఖ్యలకు ముస్తఫా మద్దతు తెలిపారు.
మధురానగర్లోని తన పెంట్హౌస్ బాత్రూమ్లో, అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక 40 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన మృతురాలు హారిక, భార్గవి లేడీస్ హాస్టల్ పైన ఉన్న ఒక పెంట్హౌస్లో ఒంటరిగా నివసిస్తోంది. గత రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడం, అలాగే ఆమె గది నుండి దుర్వాసన రావడం గమనించిన భవనవాసులు అప్రమత్తమయ్యారు. వారు మధురానగర్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాత్రూమ్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
తనపై పోక్సో కేసు నమోదైన నేపధ్యంలో, ఫిర్యాదు చేసిన యువతి మైనర్ కాదనీ, మేజర్ అంటూ బండి భగీరథ్ కోర్టులో ఫిర్యాదు చేసాడు. ఆమె పదో తరగతి సర్టిఫికేట్లో వున్న తేదీ ప్రకారం ఆమె మేజర్ అని అందులో పేర్కొన్నాడు. గతంలో ఓ కేసు విచారణకు సంబంధించి వయసు నిర్థారణ విషయంలో టెన్త్ సర్టిఫికేట్లోని తేదీని పరిగణన లోనికి తీసుకున్నదంటూ అందులో ఉటంకించారు. దాంతో ఇప్పుడు బాలిక ఫిర్యాదుపై కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఉత్తరప్రదేశ్లో బుధవారం మెరుపులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడిన భారీ తుఫానులు విరుచుకుపడటంతో, పలు జిల్లాల్లో తీవ్ర విధ్వంసం జరిగి కనీసం 89 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో ప్రయాగ్రాజ్లో 21 మంది, సంత్ రవిదాస్ నగర్లో 14 మంది, ఫతేపూర్లో 11 మంది, మరియు మీర్జాపూర్లో 10 మంది మరణించారు.
ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశామని వారు పేర్కొన్నారు. ఈ నేరానికి ఉపయోగించిన బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసును సాధ్యమయ్యే ప్రతి కోణం నుండి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై తక్షణమే, సెప్టెంబర్ 30, 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిషేధం విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఎగుమతి విధానాన్ని నియంత్రితం నుండి నిషేధితంగా సవరిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎక్స్ఎల్, టీఆర్క్యూ కోటా కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) అమెరికాకు, అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ (ఏఏఎస్) కింద, ఇతర దేశాల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం-నుండి-ప్రభుత్వానికి పంపే చక్కెర ఎగుమతులకు ఈ నిషేధం వర్తించదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తెలిపారు. రాష్ట్రం ఒక ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. రాబోయే మూడు నెలల్లో కనీసం 100 ఆంధ్రప్రదేశ్ ఆధారిత కంపెనీలు ఎన్ఎస్ఈలో నమోదయ్యేలా చూడాలని ఆయన ఎంఎస్ఎంఈ విభాగాన్ని ఆదేశించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీ-20 క్రికెట్లో 14,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి రాయ్పూర్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా, కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన 57వ మ్యాచ్లో తన 78 పరుగులు సాధించడం ద్వారా ఈ కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఆరవ బ్యాటర్ కోహ్లీ మాత్రమే.
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష)ను రద్దు చేయాలని గట్టి పిలుపునిస్తూ, ఈ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ నేపథ్యాలు, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులోని 31 నగరాల్లో మే 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్ష రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ, నీట్ ప్రారంభమైనప్పటి నుండి తమిళనాడు ప్రభుత్వం దీనిని నిరంతరం, ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని గంగోజిపేట గ్రామంలో, తన భార్య నడవడికపై అనుమానం పెంచుకున్న కె. దుర్గయ్య అనే ప్రైవేటు ఉద్యోగి, బుధవారం రాత్రి తమ నివాసంలోనే గొడ్డలితో తన భార్య వీరమణి కాలిని నరికాడు. వీరమణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దంపతులు ఇదే విషయంపై తరచుగా గొడవపడేవారు. గురువారం నాడు కూడా వారి మధ్య ఇలాంటి గొడవే జరగగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన దుర్గయ్య గొడ్డలితో వీరమణిపై దాడి చేసి ఆమె కాలిని నరికాడు.
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా (యుడబ్ల్యుఏ), ఒక చారిత్రాత్మక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని యుడబ్ల్యుఏ ఇండియా ద్వారా ప్రకటించింది. ఇది భారతీయ మార్కెట్లోని అత్యంత ముఖ్యమైన స్వతంత్ర హామీలలో ఒకటి. విభిన్న విద్యా, సామాజిక-ఆర్థిక , ప్రాంతీయ నేపథ్యాలకు చెందిన, అధిక సామర్థ్యం గల విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే యుడబ్ల్యుఏ యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది.
హిందూ మతం అనేది ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని, రోజూ ఒక దీపం వెలిగిస్తే చాలని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హిందూ మతం, విశ్వాసాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. మతం అంటే కేవలం బాహ్య అచారాలు మాత్రమే కాదని, అది ఒక అంతర్గత విశ్వాసం అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
గర్భవతులు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటుండాలి. తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా తీసుకుంటుండాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి.ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే... పప్పు ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయా వంటివి కణజాలం వృద్ధికి తోడ్పడతాయి. మాంసాహారులు గుడ్లు, చికెన్ తీసుకోవచ్చు.
విద్యపై ప్రధానంగా దృష్టి సారించిన భారతదేశంలోని ప్రముఖ ఎన్.బి.ఎఫ్.సి అయిన ఆక్సిలో ఫిన్సర్వ్, భారతదేశవ్యాప్తంగా నమోదిత పాఠశాలలు మరియు కళాశాలలకు నేరుగా ఫీజులను చెల్లించేలా తమ దేశీయ విద్యా రుణ వ్యాపారం ఇండియాఎడ్ను విస్తరించింది. ఈ కార్యక్రమం ఇంజనీరింగ్, వైద్య, మేనేజ్మెంట్ విభాగాలతో సహా కె-12, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కవర్ చేస్తుంది. అన్ని రుణ దరఖాస్తులు డిజిటల్గా ప్రాసెస్ చేయబడతాయని, ఆమోదించబడిన రుణాలు 48 గంటల్లోపు నేరుగా సంస్థ ఖాతాలోకి జమ చేయబడతాయని కంపెనీ వెల్లడించింది.
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింపుపై కేంద్రం దృష్టిసారించింది. ఈ పొదుపు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పైగా, తన కాన్వాయ్లోని వాహనాలను సగానికి సగం తగ్గించారు. ఇదే మార్గంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాటించారు. తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని వారు ఆదేశించారు.
పోక్సో కేసులో వున్న బండి భగీరథ్ ను అరెస్ట్ చేయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు అడిగేందుకు వెళితే తననే పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రని బక్క జడ్సన్ సెల్ఫీ వీడియోలో వివరించారు. ఆయన ఆ సెల్ఫీలో మాట్లాడుతూ... బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కంటే నేనేమైనా పెద్ద నేరస్థుడినా. నన్ను ఎందుకు పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. నాకు కనీసం టీ కూడా ఇవ్వలేదు. స్వయంగా బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎందుకు పోలీసులు భగీరథ్ ను అరెస్ట్ చేయడంలేదంటూ ప్రశ్నించారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంసర్వత్రా అనుకూలం. శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలనువుతాయి. ఒత్తిడికి గురికావద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలుఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రసీదులు జాగ్రత్త.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న నట్టి కుమార్ సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌన్సిల్ ప్రస్తుత పనితీరు పట్ల తీవ్ర నిరాశ, ఆందోళనతో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నిర్మాతలుగా, ఎగ్జిబిటర్లుగా మనం పర్సెంటేజ్ విధానాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాము. కార్యవర్గ సభ్యులతో సరైన సమాచారం పంచుకోకుండానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, గిల్డ్ కార్యకలాపాలు నడపడం జరుగుతోంది.
₹30,000 లంచం వ్యవహారంతో మొదలైన ఒక విచారణ, ఒక మైనింగ్ అధికారి నివాసం నుండి ₹4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకునేందుకు దారితీసింది. ఇది కేవలం ఒకే ఒక్క అధికారికి సంబంధించిన కథ కాదు, ఈ అవినీతి అనేది దేశాన్ని అంతర్గతంగా కుళ్ళబొడుస్తున్న ఒక వ్యవస్థకు ఇది అద్దం పడుతోంది. ప్రజలే స్వయంగా లంచాలు ఇవ్వడం మానేసేంత వరకు, ఇటువంటి కోట్ల రూపాయల కుంభకోణాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటాయి.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం, భారతదేశంలో అవినీతి కేసులు, అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్ఫ్లవర్ కొనుగోళ్ల నిలిపివేత రైతుల నిరసనలకు దారితీసింది. ఇది, వంట నూనెల స్వయం సమృద్ధి కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని బయటపెట్టింది. దేశీయ అవసరాలలో సుమారు 60 శాతాన్ని తీర్చే వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులను కోరారు.
జగిత్యాల జిల్లాలో ఒక మాజీ మావోయిస్టు నాయకుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరై స్థానికుల దృష్టిని ఆకర్షించారు. 'తిప్పరి తిరుపతి'గా కూడా పిలువబడే దేవ్జీ, బుధవారం నాడు కోరుట్లలోని ఒక పరీక్షా కేంద్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసి, తన మధ్యలోనే ఆగిపోయిన చదువుకు సంబంధించిన ఒక పెండింగ్ పేపర్ను పూర్తి చేశారు.