దుబాయ్లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా భారత్కు దుబాయ్ అరుదైన గౌరవం ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మువ్వెన్నెల కాంతులతో మెరిసిపోయింది. త్రివర్ణ పతాక వర్ణాలతో దుబాయ్ నగరం వెలిగిపోయింది. ఈ వేడుకల్లో భారతీయ వలసదారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. భారత్ యూఏఈ దేశాల మధ్య బలమైన మైత్రికి, సోదరభావానికి చిహ్నంగా దుబాయ్ ప్రత్యేకంగా నిలిచింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై విజయం సాధించిన తర్వాత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించి జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. ప్రపంచ ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జలమార్గంపై అమెరికా హక్కు ప్రకటిస్తానని చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే హర్మూజ్ను అమెరికా భూభాగంగా ఎలా ప్రకటిస్తారన్న దానిపై ట్రంప్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీనికి చట్టపరమైన ఆధారం ఏంటన్నదీ ఆయన స్పష్టం చేయలేదు.
వచ్చే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజల్లో ఏమాత్రం స్పందన కానరాలేదు. పాక్ తన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 14వ తేదీ జరుపుకుంది. అయితే, ఈ వేడుకలను బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజలు బహిష్కరించి తమ గృహాలకే పరిమితమయ్యారు. దీంతో బలూచిస్తాన్ ప్రావీన్స్లో పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి మచ్చుకైనా కనిపించలేదు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్లో జరగబోయే దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే చర్యల్లో భాగంగా, తమ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను యూఏఈ ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.
సింధూ నదీ జలాల అంశంపై పాకిస్తాన్ పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడుతోంది. దీనిపై భారత్ నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటారో ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించారు. ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచే తుడిచిపెడతామని పార్టీలకతీతంగా నేతలు ముక్తకంఠంతో హెచ్చరించారు.
అంతర్జాతీయ వేదికపై భారత యువ ఆర్చర్లు మరోసారి జయకేతనం ఎగురవేశారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో నిర్వహించిన ప్రపంప ఆర్చరీ కేఏఏ యూత్ ఇన్విటేషన్ 2024 టోర్నీలో భారత రికర్వ్ బాలికల జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆగస్టు 10 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోంది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన శనివారం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుల్లో ఆలపించారు.
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తమ ధైర్యం, త్యాగం, దేశభక్తితో మనం ఇపుడు అనుభవిస్తున్న స్వేచ్ఛను సాధించిపెట్టిన అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే విషయంపై ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసారు.
ముంబై: మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్, రవాణాదారులు మరియు ఫ్లీట్ ఓనర్లకు 'ప్రాఫిట్ కా రాకెట్' అనే ప్రధాన వాగ్దానంతో రూపొందించబడిన సరికొత్త హెవీ కమర్షియల్ ట్రక్ 'బ్లాజో ఐ-ట్రక్' (BLAZO i-TRK)ను ఆవిష్కరించింది. ఇది ఒక ట్రక్ మాత్రమే కాకుండా, పూర్తి బిజినెస్ సొల్యూషన్గా రూపుదిద్దుకుంది. బ్లాజో ఐ-ట్రక్ అత్యుత్తమ ఇంధన సామర్థ్యం, హై-పెర్ఫార్మెన్స్ పవర్ట్రైన్, స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీలు మరియు ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని అప్టైమ్ గ్యారెంటీని కలిగి ఉంది.
ఫ్రెంచ్ మోంటానా, ఎల్.వి. రేవంత్, నిఖిత గాంధీ, డిజే సాహిల్ గులాటి, పాయల్ ధరేలతో హైదరాబాద్ను ఉర్రూతలూగించనున్నది రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్. 2026 ఆగస్ట్ 22న గచ్చిబౌలి స్టేడియంలో సంగీతం, గేమింగ్, అద్భుతమైన అనుభవాలను ఒకచోట చేర్చుతూ, లివింగ్ ఇట్ లార్జ్ భావనకు నిజమైన నిదర్శనం.రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్- జనరేషన్ లార్జ్ యొక్క ఒరిజినల్ సౌండ్- హైదరాబాద్కు వచ్చింది. బాలీవుడ్కి చెందిన గుర్తుండిపోయే పాటలను హిప్-హాప్ యొక్క అత్యంత ఉల్లాసోత్సాహంతో కలిపింది. వేదిక మాత్రమే కాకుండా, ఈ ఉత్సవం గేమింగ్, సమకాలీన పాప్ సంస్కృతిలో లీనమయ్యే ప్రదేశంగా కూడా మారుతుంది. ఇవి ప్రత్యక్ష వినోదాన్ని పునర్నిర్వచించాయి.
కాలం తీరిన వాటర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ అది కూలిన ప్రాంతంలో, ఆ సమయంలో ఎవరు లేరు. వీడియో కనబడుతున్న దాని ప్రకారం కొన్ని అది కూలబోతున్న కొన్ని క్షణాలు ముందే స్కూల్ బస్సు ఒకటి వెళ్లింది. చిన్నారులంతా లక్కీ కిడ్స్.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలావుంటే ట్యాంక్ శబ్దం చేస్తూ కూలిపోగా అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీసారు. జంతువులు కూడా పరుగులు పెడతాయి. కానీ ఓ కుక్క మాత్రం అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకన్నట్లుగా అక్కడికి వచ్చి అంతా తేరిపార చూసి వెళ్లిపోయింది.
విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శనివారం జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శుక్రవారం స్టేడియంలో జరిగిన పూర్తి స్థాయి రిహార్సల్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఒక పరేడ్ వాహనంపై నుండి జెండా ఆవిష్కరణ, పోలీస్ పరేడ్, గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్), మోటార్సైకిల్ విన్యాసాలు, వివిధ ప్రభుత్వ శాఖల కవాతులతో సహా కార్యక్రమాలను పరిశీలించారు
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు సంబంధించిన కేసులో ఒక కొత్త మలుపు చోటుచేసుకుంది. తదుపరి విచారణ కోసం ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కు రావడం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహిళా పోలీస్ ఏసీపీ బి.ఆర్. అంబేద్కర్ శుక్రవారం మాట్లాడుతూ, తాను స్వయంగా ఫిర్యాదుదారుకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె రాలేదని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక సాధికారతకు కొత్త అర్థాన్ని ఇచ్చిన స్త్రీ శక్తి పథకం, ఆగస్టు 15 నాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండటంతో, ఈ పథకానికి మహిళల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి వివిధ వర్గాలకు చెందిన మహిళలు 87 కోట్ల సార్లు ప్రయాణించారు.
మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఒక ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న వదంతుల కారణంగా మొత్తం 608 మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నివేదికల ప్రకారం, డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు రాత్రిపూట వింత శబ్దాలు.. అంటే గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు వంటివి విన్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ అధికారులు ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, కొంతమంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు వంటి శబ్దాలు వినిపిస్తున్నాయని పలువురు బాలికలు ఫిర్యాదు చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు.
ఈమధ్య దొంగలకు బొత్తిగా భయం వుండటంలేదు. బహుశా అక్కడి పరిస్థితి ఏమిటన్నది ముందుగానే రెక్కీ చేసి తాపీగా దొంగతనాలు చేసేస్తున్నారు. దొంగతనానికి వచ్చి కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా కాసేపు నిద్రకూడా లాగించి ఆ తర్వాత హుషారుగా దోపీడి చేసి పరారవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆశ్చర్యకరమైనరీతిలో ఓ దొంగ ఏకంగా రూ. 4.71 లక్షల విలువున్న బైకుతో పరారయ్యాడు. ఈ ఘటన తాలూకు విషయం అంతా సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఆ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాము. వారణాసిలోని ఓ ఆటోమొబైల్ షోరూంలోకి ఓ దొంగ ప్రవేశించాడు.
ఆగస్టు 17న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీకి జగన్ హాజరయ్యే అంశంపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు, అధికార ఎన్డీయే ప్రభుత్వం జగన్ను అసెంబ్లీకి హాజరై పులివెందుల ఎమ్మెల్యేగా తన బాధ్యతను నిర్వర్తించాలని సవాలు చేస్తోంది. అయితే, సభకు హాజరయ్యే ముందు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా, దానికి సంబంధించిన ప్రోటోకాల్ కల్పించాలన్న డిమాండ్కు జగన్ కట్టుబడి ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలని ఆయన కోరుతున్నారు.
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన జాతీయ గీతం 'వందేమాతరం' 150 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ, ఐటీసీ లిమిటెడ్ ఘనంగా నివాళులర్పించింది. ఐటీసీ సంగీత్ రీసెర్చ్ అకాడమీ(ఐటీసీ ఎస్ఆర్ఏ) రూపొందించిన ‘దేశ్ ఏక్ రాగ్ 3’ అనే మ్యూజిక్ వీడియో ద్వారా ఈ సంగీత నివాళిని సమర్పించింది. ‘దేశ్’ రాగంలో స్వరపరిచిన ఈ గీతానికి ఐటీసీ ఎస్ఆర్ఏ గురువులు, విద్వాంసులు, సంగీత శిక్షకులు మరియు ఇతర సంగీతకారులు ప్రాణం పోశారు. దేశంలో జాతీయ మేల్కొలుపు, గర్వం మరియు ఐక్యతకు శాశ్వత చిహ్నంగా నిలిచిన ఈ గీతానికి ఐటీసీ అర్పించిన ఘన నివాళికి ఈ వీడియో ప్రతిరూపంగా నిలుస్తుంది.
హైదరాబాద్ నగరంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరూ అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. సీజేఐ జోక్యంతో పాటు ఇతర వర్గాల నుంచి తీవ్రవిమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంరుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. నిజాయితీలో ఉంటారు. ఖర్చులు అధికం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రయాణం తలపెడతారు.వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలుశుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. చిన్నపాటి పరిచయస్తులు కలుస్తారు. యోగాపై ఆసక్తి కలుగుతుంది.
తెలంగాణ: రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై ఉండి, అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు సుమారు 29°C నుండి 31°C వరకు ఉండే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘మయసభ’ కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.
ఫ్లిఫ్ కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్పై తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు 256జీబీ మోడల్ను దాని ప్రారంభ ధర కంటే తక్కువకే పొందవచ్చు. కాస్మిక్ ఆరెంజ్ రంగు వేరియంట్ ధర ఇప్పుడు రూ.1,49,900 నుండి రూ.1,41,900కి తగ్గింది. అంటే ప్లాట్ఫారమ్ నుండి నేరుగా రూ.8,000 తగ్గింపు లభిస్తోంది. ఇప్పటికే ఐఫోన్ వాడుతున్నట్లయితే, ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఐఫోన్ 16ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఫ్లిఫ్ కార్ట్ రూ.35,600 వరకు ఆఫర్ అందిస్తోంది. దీనికి ఇప్పటికే ఉన్న తగ్గింపును జోడిస్తే, 256జీబీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.98,300కి తగ్గుతుంది. ఇది ప్రారంభ ధరతో పోలిస్తే గణనీయమైన తగ్గింపు.
హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కేవైసీ కష్టాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంత వాసులను టెక్నాలజీ గుర్తించడం లేదు. దీనికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టింజెన్ ఇమ్నా అలోంగ్ షేర్ చేశారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ సరదా వీడియో, ఇప్పుడు టెక్నాలజీ పరిమితులపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చనకే దారితీసింది.
మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు ట్రైలర్ను విడుదల చేశారు.
'నారి నారి నడుమ మురారి', 'బైకర్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న 'చార్మింగ్ స్టార్' శర్వా, తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. ATV సమర్పణలో, అనిల్ సుంకర AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం అంటూ భాజపా నాయకురాలు, నటి ఖుష్బూ అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా పేర్కొంటూ... రాహుల్ గాంధీ అసభ్యకరమైన వాక్చాతుర్యం నన్ను ఆశ్చర్యపరచదు. దీనికి భిన్నంగా ఆశించడం మన అవివేకం అవుతుంది. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీజీతో సమానుడు కానే కాదు, కనీసం అణువంత కూడా సమానత్వం కలిగి లేడు.ప్రధానమంత్రిపై అతని ద్వేషం విషపూరితమైనది. అంతే అసహ్యకరమైన మరొక వ్యక్తి, వేరొక మహిళ గురించి చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యను ఆయన ఖండించకుండా నవ్వినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం నుంచి మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్లో, సన్గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న ఆయన లుక్లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్తో వెంకటేష్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది.
‘VISA - వింటారా సరదాగా’ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఉద్భవ్ రఘు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ఈ క్విర్కీ క్యాంపస్ టు USA రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ ఎస్. మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారత క్రికెటర్ రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారిని అస్సలు వదులుకోరాదని టీమిండియా వెటర్న్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్ పాత్రలపై అశ్విన్ స్పందించారు.
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు రెండు వారాలు వాయిదా పడి సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు.
నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్స్టార్ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్ను ప్రారంభించిన మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్ దర్శకత్వంలో లెల్లా రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దెయ్యాల భయంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటు చేసుకుంది. హాస్టల్లో దెయ్యాలు తిరుగుతున్నాయనే భయం విద్యార్థుల్లో నెలకొంది. దీంతో వారంతా హాస్టల్ను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
భర్తను హత్య చేస్తున్న భార్యల సంఖ్య పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తుంది. తాజాగా ఢిల్లీలో ఖర్చులకు భర్త డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో 55 ఏళ్ల భర్తను మట్టుబెట్టాలని పథకం వేసింది ఓ భార్య. అలాగే 45 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ సంబంధానికి అడ్డున్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. అంతే రాత్రి వేళ భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. ఆ తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించి, అత్యంత క్రూరంగా భర్త ప్రైవేట్ పార్ట్కు కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసింది. ఆపై ఇంట్లో దొంగలు పడి భర్తను చంపారని డ్రామా చేసింది.
అలుపులేకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేసుకుంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెట్టే రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో తరుచూ అప్డేట్స్ ఇవ్వరు. అలాంటి ప్రభాస్ తన ఇన్ స్టా పేజీ డీపీ మార్చారంటే అది క్రేజీ న్యూస్ గా మారిపోవడం సహజమే. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీ డిస్ ప్లే పిక్చర్ మార్చారు. తన కొత్త సినిమా "ఫౌజీ" స్టిల్ తో ప్రభాస్ ఇన్ స్టా డీపీ పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ డే కు ఒకరోజు ముందు ప్రభాస్ తన డీపీ మార్చడం వైరల్ గా మారింది.
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) చిన్నతనంలో తండ్రిని స్పూర్తిగా తీసుకుని ఎదిగిన ఫిస్టల్ షూటర్. పెద్దయ్యాక అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. కానీ తండ్రి చేసిన ఓ పని వల్ల పెండ్లిమీద పెద్దగా ఆసక్తి వుండదు. తల్లి (రాధిక) కోరికమేరకు తస సోదరి స్నేహితురాలు సూచన మేరకు సరోగసి ద్వారా విదేశాల్లో వుండే అమ్మాయితో మగపిల్లవాడికి తండ్రి అవుతాడు. అయితే పిల్లాడు చిన్నగా వున్నప్పుడే ముక్కునుంచి రక్తంకారడంతో అందుకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్లు తేల్చిచెబుతారు.
రాజధాని అమరావతిలో భూ సమీకరణ పథకానికి సంబంధించి జరిగినట్లు ఆరోపించబడిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణలపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి లేదని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు రాష్ట్ర అగ్నిమాపక శాఖ కోసం 58 అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో, కొత్తగా ప్రారంభించిన ఈ3 సీడ్ యాక్సెస్ రోడ్పై ఉన్న రెండవ స్టీల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రూ.40 కోట్ల వ్యయంతో సమకూర్చిన ఈ వాహనాల శ్రేణిలో 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు, 20 వాటర్ బౌజర్లు (నీటి ట్యాంకర్లు), 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు ఉన్నాయి.
ఇంట్లో దొంగపడ్డాడు.. మంచం కింద దాక్కున్నాడు.. ఆపై దొరికిపోతామనే భయంతో కిటికీ అద్దం పగులకొట్టి పారిపోయాడు. ఏలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉంగుటూరు మండలం కొయ్యగురపాడు గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఒక దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలను అపహరించిన అనంతరం మంచం కింద దాక్కున్నాడు. సమాచారం ప్రకారం, ఆ దొంగ డొనేపూడి భాస్కర్ ఇంట్లోకి ప్రవేశించి గొలుసు, కడియం, ఉంగరం వంటి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. దొంగతనం చేసిన తర్వాత నిందితుడు మంచం కింద దాక్కున్నట్లు తెలిసింది.
శబరిమల ఆలయంలో బంగారం మాయమైన ఘటనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న ఎస్పీ ఎస్. శశిధరన్కు విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పతకం లభించిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, కేరళ పోలీస్, అగ్నిమాపక, రక్షణ సేవలు, అలాగే జైలు, సంస్కరణ సేవల విభాగాలకు చెందిన 11మంది అధికారులు వివిధ రాష్ట్రపతి పోలీస్ అగ్నిమాపక సేవా పతకాలకు ఎంపికయ్యారు.
వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. క్షణిక సంతోషం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లాలో నడివయసున్న ఇద్దరు దంపతులు మిస్సింగ్ కేసు నమోదైంది. వీరి ఆచూకి కోసం లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇద్దరు యువ కానిస్టేబుళ్లే నిందితులని ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఖంగుతిన్నారు. ఐనా... పోలీసులు ఏమిటి.. ఇలాంటి పని చేయడం ఏంటి? అని పోలీసు డిపార్టుమెంటులోని వారే తొలుత నమ్మలేకపోయారు. ఐతే కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సదరు నిందితులైన యువ పోలీసులు దంపతులిద్దర్నీ హత్య చేసి భూమిలో పాతిపెట్టినట్లు తేలింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి మూడు నెలలకు పైగా గడిచింది. ఈ కాలంలో ఆయన పనితీరు చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన సమర్థవంతమైన పాలనను అందిస్తూ పనులను చక్కగా పూర్తి చేస్తున్నారు. అయితే, గత మూడు నెలల్లో తమిళనాడుకు రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని విజయ్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన మాత్రం ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. గత వంద రోజుల్లో రాష్ట్రానికి 67,000 ఉద్యోగాలు, రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజల్లో సానుకూల స్పందనను పొందలేకపోయింది.
ఆస్తి కోసం ఓ కుమారుడు ఘాతుకానికి తెగబడ్డాడు. శవం అని కూడా చూడలేదు. చనిపోయిన తండ్రి చేతి వేలి ముద్రలను ఖాళీ పత్రాల్లో తీసుకున్నాడు. మృతదేహం వేలిని పట్టుకుని ఖాళీ కాగితాలపై వేలిముద్ర వేయించిన దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖరౌహా గ్రామంలో చోటుచేసుకుంది.
ఇండిగో విమానాన్ని ఆకస్మిరంగా రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరిలో ఓ మహిళా ప్రయాణికురాలు లగేజీ బెల్టుపైకి ఎక్కి నిరసన తెలుపడంతో పాటు విమాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో చోటుచేసుకుంది. ఈ ఘటన వీడియో వైరల్గా మారింది.
బెంగుళూరు నగర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఇంటి ముందు పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే రూ.25 వేల మేరకు పార్కింగ్ రుసుం చెల్లించాల్సివుంటుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) రూపొందించిన 'పార్కింగ్ రూల్స్-2026' ముసాయిదా ప్రకారం.. వాహనదారులు ఏటా రూ.25,000 వరకు చెల్లించి 'రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్' పొందడం తప్పనిసరి కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, హైదరాబాద్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అత్యంత కీలకమైన పదవిని అప్పగించనుంది. ఇందులోభాగంగా, బీసీసీఐ పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ మార్పుల్లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనే కొత్త పోస్టును సృష్టించి, ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్కు అప్పగించాలని భావిస్తోంది. ప్రస్తుతం లక్ష్మణ్ బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అధిపతిగా కొనసాగుతున్నారు.
శ్రీలంక క్రికెట్లో దారుణం జరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ సీనియర్ కోచ్ సుమిత్ ఫెర్నాండో (62) దారుణ హత్యకు గురయ్యాడు. వన్డే జట్టు కెప్టెన్ కుశాల్ మెండిస్ వంటి ఎందరో యువ క్రికెటర్లతో ఓనమాలు దిద్దించారు. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య చెలరేగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఆయన, దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తాగునీటి విషయంలో చెలరేగిన ఓ చిన్న గొడవ ఆయన ప్రాణాలను బలిగొంది.
ఐఐటీ ఖరగ్పూర్ క్యాంపస్లోని ఒక భవనం మూడవ అంతస్తు నుండి కింద పడి 19 ఏళ్ల విద్యార్థి మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నలంద భవనం మూడవ అంతస్థు టెర్రస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కింద పడటంతో ఈ ఘటన జరిగిందని ఒక అధికారి పేర్కొన్నారు. మరణించిన విద్యార్థిని రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన అంకిత్ శర్మగా గుర్తించారు. భవనం సమీపంలో ఉన్న కొందరు విద్యార్థులు, ఇతరులు ఏదో పడిన శబ్దాన్ని విని, అతను నేలపై పడి ఉండటాన్ని గమనించారని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.