ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం రెండు నెలల క్రితమే హైదరాబాద్లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఈసారి ఆయనకు శారీరక సమస్యకు సంబంధించిన చికిత్స జరుగుతోంది.
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 'అసుర ఆగమన' గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది.
విజయవాడలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషనులో హెడ్కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న అశోక్, నానిలు సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటి ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్, నానిలు సీఐ నాగరాజుకు సహకారం అందించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ క్రమంలో ఈ కేసులో సీఐ నాగరాజును సిట్ అరెస్టు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వీరభ్రదపురం.. అందమైన పల్లెటూరు.. అయితే ఆ ఊరు వెనుక తెలియని ఓ రహస్యం ఉంది..అదే వీరభద్రుడు. ఊరిని కాపాడే వీరభద్రుడు నుంచి తప్పు చేయాలనుకున్నవారు తప్పించుకోలేరు.. ఊళ్లోని ధర్మ గంట మోగిందంటే.. తప్పు చేసిన వాళ్లు అంతం కాక తప్పదు. దీంతో ఊళ్లోని ప్రజలు క్రమశిక్షణతో మెలుగుతుంటారు. అలాంటి ఊర్లోకి వెన్నెల అనే అమ్మాయి (అనీ) వస్తుంది.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
పూణెకు చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి షాపింగ్ పేరుతో తన కాబోయే భార్య సియా గోయల్ అతని నుంచి దాదాపు రూ. 1 కోటి తీసుకుని, ఆ మొత్తాన్ని తన ప్రియుడిగా భావిస్తున్న చేతన్ చౌదరికి అందజేసిందని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇస్మార్ట్ శంకర్..లో నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి గాయం అయింది. ఆ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నాను. ఫిజికల్గా, మెంటల్గా పూర్తిగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలి. స్క్రీన్పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని భావిస్తాను. అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించాను అని హీరోయిన్ నభా నటేష్ తెలిపారు.
గృహ రుణాలు, వ్యాపార రుణాలు మరియు పిల్లల చదువుల వంటి నిర్దిష్ట ఆర్థిక బాధ్యతలు ఉన్న కస్టమర్ల కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 'ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్' (ICICI Pru iProtect Smart Plus) పేరుతో 10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్ను తీసుకొచ్చింది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు, ఆదాయంపై ఆధారపడే పరిస్థితి అత్యధికంగా ఉండే కీలక సమయంలో ఈ పాలసీ, జీవిత బీమా కవరేజీని అందిస్తుంది.చాలా మంది వ్యక్తులకు, ఒక పెద్ద ఆర్థిక బాధ్యతను నెత్తిన వేసుకున్న తర్వాత మొదటి పదేళ్ల కాలం అత్యంత కీలకమైనదిగా ఉంటుంది.
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో హీరో సూర్య, నటి కాయదు లోహర్, ప్రముఖ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్లో ఈ భారీ చిత్రం రూపొందనుంది. పవర్ ఫుల్ కథను అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని కన్నడ నటి కృషి తాపండా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈమె స్నేహితుడు వైశాఖ విగతజీవిగా కనిపించడం కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతడి మృతిపై కొద్ది రోజులుగా నెట్టింట పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. నటిని టార్గెట్ చేసేలా కొంతమంది పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.
సాంకేతికపరమైన మార్పులు, మారుతున్న ఉద్యోగ అవసరాల మధ్య ఉన్నత విద్య వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్ ప్రతిభను, నాయకత్వాన్ని పెంపొందించే వ్యవస్థలుగా మారుతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన 'ది ఎకనామిక్ టైమ్స్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026'లో ముఖ్య వక్తగా పాల్గొన్న మోహన్ బాబు యూనివర్సిటీ(ఎంబియు) ప్రో ఛాన్సలర్ డాక్టర్ మంచు విష్ణు.. భవిష్యత్తు కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఏఐ ఆధారిత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభ్యసనం, ఆధునిక క్యాంపస్ మౌలిక సదుపాయాలు మరియు విలువలతో కూడిన విద్యను ఏకం చేస్తూ ఉన్నత విద్యను పునర్నిర్మించాలన్న యూనివర్సిటీ దార్శనికతను పంచుకున్నారు.
ఈ నగరానికి ఏమైంది' చిత్రం ఇప్పుడు సీక్వెల్ 'ENE Repeat'తో సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆ మ్యాజిక్ను మళ్లీ క్రియేట్ చేయడానికి రీయూనియన్ అవుతుండగా, శ్రీనాథ్ మాగంటి ఈ టీంకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మరోసారి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
త్రిభాషా విధానంపై టెన్త్ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులోభాగంగా, ప్రస్తుతం పదో తరగతిలో ఉన్న విద్యార్థులకు మూడు భాషల చదవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇందులోభాగంగా, కొత్త మార్గదర్శకాలను విడులను విడుదల చేసింది.
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్కు తొలి పాట ఇరుముడి కట్టుతో అద్భుతంగా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్కు లభించిన అద్భుత స్పందన, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ అద్భుతమైన ఫామ్ తో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఓ విషాదం చోటుచేసుకుంది. చిన్నగొల్లపాలెం గ్రామంలోని చెరువులో రెండు మృతదేహాలను స్థానికులు సోమవారం గుర్తించారు. ఈ రెండు మృతదేహాలు తాడుతో బైకుకు కట్టి ఉంచడం స్థానికంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత వారం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తాను హోం మంత్రిని కాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని నేరస్తులు చాలా అదృష్టవంతులని తెలిపారు. "ఒకవేళ నేను హోం మంత్రిని అయి ఉంటే, మీ బతుకులు దుర్భరంగా ఉండేవి" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారితీసింది. ఒకవేళ ఆయన నిజంగానే హోం మంత్రి అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ప్రజలు రకరకాలుగా ఊహించడం మొదలుపెట్టారు.
సిద్ధిపేటలో భారీ చోరీ చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఒక భారీ దొంగతనంలో, దుండగులు తాళం వేసి ఉన్న ఇంటి నుండి ఒక కిలోగ్రాముకు పైగా బంగారాన్ని అపహరించారు. వివరాల్లోకి వెళితే... ఈ ఇల్లు చింత రాజ్కుమార్ అనే వ్యక్తికి చెందినది. కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు వెళ్లిన సమయంలో, ఇంటికి తాళం వేసి ఉండగా ఈ ఘటన జరిగింది. వారు లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి, బీరువాను పగలగొట్టి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనివల్ల అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోగా, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ అకస్మాత్తు వర్షం ఉక్కపోత వాతావరణం నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయేలా చేసింది. రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామల సెంటర్, కోటిపల్లి బస్ స్టాండ్, డీలక్స్ సెంటర్, హైటెక్ బస్ స్టాండ్, ఆదాయపు పన్ను కార్యాలయ రోడ్డు, కంబాల చెరువు, కోరుకొండ రోడ్డు వంటి ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి.
క్రికెట్ పసికూన ఐర్లాండ్ జట్టు చేతిలో టీ20 వరల్డ్ కప్ చాంపియన్ భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ టూర్లో సిరీస్ను ఏకంగా 0-2 తేడాతో ఓడిపోయింది. ఇది ఇపుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఓటమి నేపథ్యంలో 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఈ చర్చపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డచ్ కేట్ స్పందించాడు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాడని, అయితే జట్టులోకి రావాలంటే మిగతా ఆటగాళ్లలాగే ఓ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు జులై 31 లోపు దాఖలు చేయాల్సివుంటుంది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసే వారికి ఈ గడువు వర్తిస్తుంది. ఆలస్యమైతే జరిమానా పడే అవకాశం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, మరికొన్ని పన్ను ప్రయోజనాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్నులు దాఖలు చేయడం మంచిది.
మహారాష్ట్రలోని పుణెలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 యేళ్ల భీమ్రావ్ అనే వృద్ధుడికి మరణ శిక్ష విధించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయస్థానం.. శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. 2026 మే ఒకటో తేదీన జరిగిన ఈ హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 30, జూలై 1 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని రెండు విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు హాజరుకానున్నారు. రాష్ట్రపతి షెడ్యూల్ ప్రకారం, జూన్ 30న విశాఖపట్నంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు.
భార్య, అత్తమామల మానసిక వేధింపులు తట్టుకోలేక ఒక వస్త్ర వ్యాపారి తన దుకాణంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కొన్ని నిమిషాల ముందు ఆయన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తన చావుకు భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, మరదలు నీతూలే కారణమని బాధిత యువకుడు ఆ వీడియోలో ఆరోపించాడు.
కేరళలోని అనక్కరలో ఏడవ తరగతి విద్యార్థిపై దాడి చేశారన్న ఆరోపణతో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై కేసు నమోదైనట్లు అధికారులు సోమవారం తెలిపారు. అనక్కరలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన శివకుమార్ అనే ఉపాధ్యాయుడిపై ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆ ఉపాధ్యాయుడు విధించిన శిక్ష కారణంగా, పాఠశాలలోని తమిళ మాధ్యమ విభాగంలో చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థి ఒకరు గత వారం గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆందోళన చెందడంతో పాటు జైలుకు పంపుతారని భయపడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని బోరపండ ఏరియాలో జరిగింది.
అయోధ్య రామమందిర విరాళాల చోరీపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవులు ముగిసిన వెంటనే ఈ పిటిషన్ను విచారణకు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశంలో అంత అత్యవసరం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్టు చేసిన సిట్ అధికారులు... తాజాగా సోమవారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి రాజధాని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ గానీ లేదా వైసీపీ ప్రభుత్వం గానీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకంగా లేదని వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ వాదిస్తున్నారు. మచిలీపట్నం, గుంటూరుతో పాటు అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం జగన్కు ఎప్పుడూ ఉండేదని, ఆయన రాజధాని ప్రాంతానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఈ యువ నాయకుడు పేర్కొన్నారు.
యూట్యూబ్ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మహేంద్రన్ తన మేనల్లుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం గురించి ప్రస్తావించారు దీనివల్ల, కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను ఆయన పొరపాటున ధృవీకరించారేమోనని చాలామంది భావించారు. "అనిరుధ్ మృదు స్వభావి. నాకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి (కావ్య మారన్) సాధారణ వ్యక్తి కాదు. అంత పెద్ద టీమ్ను నిర్వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది. తండ్రి వ్యాపార నైపుణ్యాలు ఆమెకు వచ్చాయి. ఇద్దరూ మంచి జోడీ. కలిసి మ్యూజిక్ బిజినెస్లో కూడా రాణించగలరు" అని వైజీ పేర్కొన్నారు. మహేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలతో కావ్య-అనిరుధ్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో తన పేరు తొలగిస్తారనే భయంతో, దానివల్ల మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లలతో సహా తన కుటుంబంపై పడే పరిణామాల గురించి ఆందోళనతో 51 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.2002 ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడం, పత్రాల్లోని అవకతవకల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన క్యాబ్ డ్రైవర్ షేక్ ముజ్బిల్ రెహమాన్, ఆదివారం తెల్లవారుజామున బోరబండలోని భరత్ నగర్లో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకున్నాడు.
వెనెజులాలో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 1,450కి పెరిగిందని వెనెజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు. 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ రెండు శక్తివంతమైన భూకంపాల తర్వాత, వెనెజులాలో 430 తేలికపాటి నుండి మధ్యస్థాయి ప్రకంపనలు నమోదయ్యాయని జాతీయ అత్యవసర పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారంలో రోడ్రిగ్జ్ పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం నుండి వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానం ల్యాండింగ్ సమయంలో, శంషాబాద్లో ప్రసరించిన లేజర్ కాంతి పైలట్కు అంతరాయం కలిగించింది. ఫ్రాంక్ఫర్ట్ నుండి షంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న విమానంపై రాత్రిపూట లేజర్ కాంతి పడింది. పైలట్ వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించగా, అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే విమానం ఆర్జీఐఏలో సురక్షితంగా దిగింది. శంషాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాల్స్లో వివాహ వేడుకల సమయంలో వెలువడిన లేజర్ కాంతులు విమాన పైలట్లకు అంతరాయం కలిగించాయి.
ఒరిస్సా రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. వివాహ వేడుక విందు భోజనంలో మాంసం వడ్డించలేదన్న అక్కసుతో కేటరింగ్ సిబ్బందిపై దాడి జరిగింది. నలుగురు యువకులు పదునైన కత్తులతో ఈ దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు నేతలపై శనివారం కేసులు నమోదయ్యాయి. దీంతో వైకాపా నేతల్లో భయం పట్టుకుంది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంగ్రహసంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు.
మహారాష్ట్ర పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకు మాస్టర్ మైండ్ సియా గోయల్ ప్రియుడు చేతన్ అని వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలు సియాతో కేతన్ అగర్వాల్ పెళ్లిని ఆపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. లోహగడ్ కోట వద్ద కొండపై నుంచి తోసేసి హత్య చేసిన కేసులో సిసీటీవీ ఫుటేజీ, మొబైల్ డేటా ఆధారంగా ఈ హత్య కేసులేని గుట్టును పోలీసులు ఛేదించారు. కేతన్తో సియాకు జరగాల్సిన పెళ్లిని ఆపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది.
తులసివనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో ఒక జానెడు ఉన్న వ్యక్త మిగిలిండు. వచ్చే ఎన్నికల్లో ఆయనను కూడా గెలవనివ్వం అంటూ భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత, ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ను ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరేలా తమిళ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ కామెంట్స్ చే్శారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనిరుధ్, కావ్యల గురించి మాట్లాడుతూ.. "అనిరుధ్ చాలా మంచివాడు, సాఫ్ట్ బాయ్. ఎంతో సమర్థుడు. అయితే, ఏదో ఒక విషయం అతడిని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నా" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. ఈ ధరను చూసి తెలంగాణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత మూడు నెలలుగా నిరంతరంగా పెరుగుతున్న కోడిగుడ్డు ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.8 పలుకుతుండగా, సమీప భవిష్యత్తులో ఇది రూ.10కి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఈఠ. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఈ సినిమా టీజర్ జూన్ 23న విడుదలై వివాదంలో చిక్కుకుంది. మరాఠీ 'లవాణి' కళాకారిణి 'విఠాబాయి నారాయణ్ గావ్కర్' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ టైటిల్పై రాజకీయపార్టీ ఎన్సీపీ, విఠాబాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీలోని విజయవాడ రాజకీయాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ మాజీ ఎంపీ, వైకాపా నేత కేశినేని నాని.. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ భూకబ్జా యత్నాన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీత అహుజా సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు అనేక మంది మహిళలతో సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆమె 'లాకప్ : సచ్ యా సజా' అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్గా పాల్గొంటున్నారు. షో ప్రీమియర్ ఎపిసోడ్లోనే తన వివాహ జీవితంలోని రహస్యాలను బయటపెట్టి, భర్త గోవిందాకు గతంలో పలువురితో ఎఫైర్లు ఉన్నాయని అంగీకరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఓ మహిళ హైదరాబాద్ ఆస్పత్రిలో హల్చల్ చేసింది. కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ వైద్యులపై దాడికి దిగింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేయగా, ఆమెకు ఎలాంటి జబ్బూ లేదని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తితిదేకు రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు అన్నీ కూడా తామే భరిస్తామని తితిదే అధికారులకు వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోడూరులో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఒక బాలికను స్థానికులు సురక్షితంగా రక్షించారు. గల్లంతైన బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వైకాపా బృందం రాజధాని పర్యటనలో ఘర్షణకు సంబంధించి తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పెనుమాకకు చెందిన మాణిక్యం ఫిర్యాదు మేరకు వైకాపా నేతలపై అట్రాసిటీకేసు నమోదైంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నెట్టినందుకు మాజీ మంత్రి అబటి రాంబాబుపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు పోలీసు 30 యాక్టు కింద కేసు నమోదు చేశారు. వైకాపా నేత నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు కారు అద్దం పగలగొట్టిన తెదేపా నేతలపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.