Shorts

Notifications

ఫ్రెంచ్ మోంటానా, ఎల్.వి. రేవంత్, నిఖిత గాంధీ, డిజే సాహిల్ గులాటి, పాయల్ ధరేలతో హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్నది రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్. 2026 ఆగస్ట్ 22న గచ్చిబౌలి స్టేడియంలో సంగీతం, గేమింగ్, అద్భుతమైన అనుభవాలను ఒకచోట చేర్చుతూ, లివింగ్ ఇట్ లార్జ్ భావనకు నిజమైన నిదర్శనం.రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్- జనరేషన్ లార్జ్ యొక్క ఒరిజినల్ సౌండ్- హైదరాబాద్‌కు వచ్చింది. బాలీవుడ్‌కి చెందిన గుర్తుండిపోయే పాటలను హిప్-హాప్ యొక్క అత్యంత ఉల్లాసోత్సాహంతో కలిపింది. వేదిక మాత్రమే కాకుండా, ఈ ఉత్సవం గేమింగ్, సమకాలీన పాప్ సంస్కృతిలో లీనమయ్యే ప్రదేశంగా కూడా మారుతుంది. ఇవి ప్రత్యక్ష వినోదాన్ని పునర్నిర్వచించాయి.

కాలం తీరిన వాటర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ అది కూలిన ప్రాంతంలో, ఆ సమయంలో ఎవరు లేరు. వీడియో కనబడుతున్న దాని ప్రకారం కొన్ని అది కూలబోతున్న కొన్ని క్షణాలు ముందే స్కూల్ బస్సు ఒకటి వెళ్లింది. చిన్నారులంతా లక్కీ కిడ్స్.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలావుంటే ట్యాంక్ శబ్దం చేస్తూ కూలిపోగా అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీసారు. జంతువులు కూడా పరుగులు పెడతాయి. కానీ ఓ కుక్క మాత్రం అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకన్నట్లుగా అక్కడికి వచ్చి అంతా తేరిపార చూసి వెళ్లిపోయింది.

విజయవాడలోని సింగ్ నగర్‌లో ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శనివారం జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శుక్రవారం స్టేడియంలో జరిగిన పూర్తి స్థాయి రిహార్సల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఒక పరేడ్ వాహనంపై నుండి జెండా ఆవిష్కరణ, పోలీస్ పరేడ్, గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్), మోటార్‌సైకిల్ విన్యాసాలు, వివిధ ప్రభుత్వ శాఖల కవాతులతో సహా కార్యక్రమాలను పరిశీలించారు

మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఒక ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్‌లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న వదంతుల కారణంగా మొత్తం 608 మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నివేదికల ప్రకారం, డోమా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు రాత్రిపూట వింత శబ్దాలు.. అంటే గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు వంటివి విన్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ అధికారులు ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, కొంతమంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు వంటి శబ్దాలు వినిపిస్తున్నాయని పలువురు బాలికలు ఫిర్యాదు చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు.

ఈమధ్య దొంగలకు బొత్తిగా భయం వుండటంలేదు. బహుశా అక్కడి పరిస్థితి ఏమిటన్నది ముందుగానే రెక్కీ చేసి తాపీగా దొంగతనాలు చేసేస్తున్నారు. దొంగతనానికి వచ్చి కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా కాసేపు నిద్రకూడా లాగించి ఆ తర్వాత హుషారుగా దోపీడి చేసి పరారవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆశ్చర్యకరమైనరీతిలో ఓ దొంగ ఏకంగా రూ. 4.71 లక్షల విలువున్న బైకుతో పరారయ్యాడు. ఈ ఘటన తాలూకు విషయం అంతా సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఆ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాము. వారణాసిలోని ఓ ఆటోమొబైల్ షోరూంలోకి ఓ దొంగ ప్రవేశించాడు.

ఫ్లిఫ్ కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు 256జీబీ మోడల్‌ను దాని ప్రారంభ ధర కంటే తక్కువకే పొందవచ్చు. కాస్మిక్ ఆరెంజ్ రంగు వేరియంట్ ధర ఇప్పుడు రూ.1,49,900 నుండి రూ.1,41,900కి తగ్గింది. అంటే ప్లాట్‌ఫారమ్ నుండి నేరుగా రూ.8,000 తగ్గింపు లభిస్తోంది. ఇప్పటికే ఐఫోన్ వాడుతున్నట్లయితే, ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఐఫోన్ 16ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఫ్లిఫ్ కార్ట్ రూ.35,600 వరకు ఆఫర్ అందిస్తోంది. దీనికి ఇప్పటికే ఉన్న తగ్గింపును జోడిస్తే, 256జీబీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.98,300కి తగ్గుతుంది. ఇది ప్రారంభ ధరతో పోలిస్తే గణనీయమైన తగ్గింపు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం అంటూ భాజపా నాయకురాలు, నటి ఖుష్బూ అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా పేర్కొంటూ... రాహుల్ గాంధీ అసభ్యకరమైన వాక్చాతుర్యం నన్ను ఆశ్చర్యపరచదు. దీనికి భిన్నంగా ఆశించడం మన అవివేకం అవుతుంది. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీజీతో సమానుడు కానే కాదు, కనీసం అణువంత కూడా సమానత్వం కలిగి లేడు.ప్రధానమంత్రిపై అతని ద్వేషం విషపూరితమైనది. అంతే అసహ్యకరమైన మరొక వ్యక్తి, వేరొక మహిళ గురించి చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యను ఆయన ఖండించకుండా నవ్వినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

భర్తను హత్య చేస్తున్న భార్యల సంఖ్య పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తుంది. తాజాగా ఢిల్లీలో ఖర్చులకు భర్త డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో 55 ఏళ్ల భర్తను మట్టుబెట్టాలని పథకం వేసింది ఓ భార్య. అలాగే 45 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ సంబంధానికి అడ్డున్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. అంతే రాత్రి వేళ భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. ఆ తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించి, అత్యంత క్రూరంగా భర్త ప్రైవేట్ పార్ట్‌కు కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసింది. ఆపై ఇంట్లో దొంగలు పడి భర్తను చంపారని డ్రామా చేసింది.

వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. క్షణిక సంతోషం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లాలో నడివయసున్న ఇద్దరు దంపతులు మిస్సింగ్ కేసు నమోదైంది. వీరి ఆచూకి కోసం లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇద్దరు యువ కానిస్టేబుళ్లే నిందితులని ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఖంగుతిన్నారు. ఐనా... పోలీసులు ఏమిటి.. ఇలాంటి పని చేయడం ఏంటి? అని పోలీసు డిపార్టుమెంటులోని వారే తొలుత నమ్మలేకపోయారు. ఐతే కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సదరు నిందితులైన యువ పోలీసులు దంపతులిద్దర్నీ హత్య చేసి భూమిలో పాతిపెట్టినట్లు తేలింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి మూడు నెలలకు పైగా గడిచింది. ఈ కాలంలో ఆయన పనితీరు చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన సమర్థవంతమైన పాలనను అందిస్తూ పనులను చక్కగా పూర్తి చేస్తున్నారు. అయితే, గత మూడు నెలల్లో తమిళనాడుకు రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని విజయ్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన మాత్రం ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. గత వంద రోజుల్లో రాష్ట్రానికి 67,000 ఉద్యోగాలు, రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజల్లో సానుకూల స్పందనను పొందలేకపోయింది.