టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్
తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సామాజిక సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్, తిరుమలకు వచ్చే భక్తులకు కాలుష్య రహిత, మరింత స్థిరమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా 25 ఎలక్ట్రిక్ బస్సులు, ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని అందజేసింది. తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రానికి రానున్న తరుణంలో ఈ బస్సులు అందుబాటులోకి రావడం విశేషం.
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం నాడు సంప్రదాయబద్ధమైన ధ్వజారోహణం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు అంకురార్పణంతో ఉత్సవాల ప్రక్రియ మొదలైంది. మీన లగ్నంలో సాయంత్రం 6:21 నుండి 6:35 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది.
ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య, గరుత్మంతుని చిత్రం కలిగిన పవిత్రమైన పసుపు రంగు ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అంతకుముందు, కొండపై ఉన్న ఆలయంలో ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఉత్సవ మూర్తులు, పరివార దేవతలను బంగారు పల్లకీలో ఊరేగింపుగా బయటకు తీసుకువచ్చారు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిచక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము.
చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం.
ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం.
భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం.
చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం.
పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం.
రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం.
బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం - బీర్ పార్టీకి పిలిచి రాడ్తో కొట్టి హత్య
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బీజేపీ నేత మేనల్లుడిని అతడి స్నేహితుడే కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. సెప్టెంబరు 7వ తేదీన హర్యానా రాష్ట్రంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీ సమీపంలో జితేంద్ర (40) అనే వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో పడివుంది. తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించిన పోలీసులు... జితేంద్ర మామ, బీజేపీ నేత ఉత్తమ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భార్యతో జితేంద్రకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడి స్నేహితుడు ప్రవీణ్ ఈ హత్యకు పక్కా ప్లాన్ వేసి చంపేసినట్టు తేలింది.
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్
కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా తన 13వ సినిమాను.వినాయక చవితి సందర్భంగా కిరణ్ అబ్బవరం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అందంగా అలంకరించిన గణేశుడి విగ్రహం ముందు నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. వార్మ్ గోల్డెన్ లైటింగ్, పూల అలంకరణలు, సంప్రదాయ వాతావరణం, భారీ గణేశుడి విగ్రహం పోస్టర్కు పండుగ కళను తీసుకొచ్చాయి. అదే సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పోస్టర్ను డిజైన్ చేశారు.
1,000కు పైగా సర్వీస్ టచ్పాయింట్లను అధిగమించనున్న ఏఐ+ స్మార్ట్ఫోన్
ఏఐ+ స్మార్ట్ఫోన్, భారతదేశంలో తమ అమ్మకాల తర్వాత అనుభవాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా తమ సర్వీస్ నెట్వర్క్ను 1,000కు పైగా సర్వీస్ సెంటర్లకు విస్తరించేందుకు ప్రణాళికలను చేసింది. ఈ దీపావళికి ఢిల్లీలో తమ మొదటి ప్రత్యేక ఏఐ+ సర్వీస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనుంది. తమ భౌతిక సేవా మౌలిక సదుపాయాల విస్తరణకు తోడుగా, ఈ బ్రాండ్ ఏఐ+ అసిస్టెన్స్ యాప్ను కూడా పరిచయం చేస్తోంది. ఇది డివైస్ సపోర్ట్, సర్వీస్ బుకింగ్లు, టికెట్ ట్రాకింగ్, ట్రబుల్షూటింగ్ సహాయాన్ని ఒకే చోట అందించడానికి రూపొందించిన ఒక ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























