పొట్టి అయినా గట్టి.. రెండు అడుగుల వ్యక్తి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
పొట్టి వాళ్లు గట్టిగా వుంటారని పెద్దలు అంటూ వుంటారు. డబ్బు సంపాదించేందుకు ఆరడుగుల ఎత్తున్న వారే అష్టకష్టాలు పడుతున్న ప్రస్తుత కాలంలో కేవలం రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉండి రోజుకు దగ్గర దగ్గరగా రెండు వేల రూపాయలు సంపాదించే వ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు జీవనోపాధి కోసం ఇబ్బంది పడిన వీరబాబు అనే రెండు అడుగుల ఎత్తుండే వ్యక్తి, ఇప్పుడు రోజుకు రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు సంపాదిస్తూ అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య (ఐఏఎస్) అందించిన మద్దతు, మార్గదర్శకత్వం వల్లే ఈ మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?
తిరుమల రాజగోపురంపై ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ఒక చేయి విరిగిపోయినట్లు సమాచారం. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు చేపట్టిన నిర్వహణ, రంగులు వేసే పనుల సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విగ్రహం ఎప్పుడు, ఎలా దెబ్బతిన్నదనే దానిపై టీటీడీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 23 వరకు తిరుమల ఆలయంలో జరగనున్నాయి. ఆలయంలో ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడింది.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము.
శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?
అన్ని జన్మలలోకెల్ల ఉత్తమోత్తమమైనది మానవ జన్మ అంటారు. ఐతే ఏవేవో చిన్నచిన్న కారణాలతో ప్రాణాలను తీసుకుంటున్నారు. బలవన్మరణం పొందుతున్నారు. భర్తకు వీడియో కాల్ చేస్తే అతడు దానిని లిఫ్ట్ చేయలేదని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన 20 ఏళ్ల అఖిలకి రెండేళ్ల క్రితం హుస్సేన్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5 నెలల పాప వున్నది. ప్రస్తుతం ఆమె పుట్టింటిలో వున్నది. పాప ఏడుస్తోందని, తన భర్తను వీడియో కాల్ ద్వారా మాట్లాడించాలని ఫోన్ చేసింది.
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ సీజన్ 10.. డబుల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్?
బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభమై కేవలం రెండు రోజులే అయ్యింది. అప్పుడే కృష్ణుడు, రోహిత్ వంటి పోటీదారులు ఇంట్లో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది, త్వరలోనే ఈ వారానికి ఎవరు నామినేట్ అయ్యారో తెలుస్తుంది. మరోవైపు, ఈ వారాంతంలో డబుల్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ (ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు ఎలిమినేట్ కావడం) ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 24న ఫ్లిప్కార్ట్లో మివి వన్ తొలి స్మార్ట్ఫోన్ విడుదల, కొనేస్తారంతే...
హైదరాబాద్: భారతదేశపు విశ్వసనీయమైన, ప్రముఖ స్వదేశీ వినియోగదారుల టెక్నాలజీ బ్రాండ్లలో ఒకటైన మివి ఇప్పుడు క్వాల్కామ్, ఫ్లిప్కార్ట్ మరియు గూగుల్లతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని మివి వన్తో స్మార్ట్ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. మివి వన్ సెప్టెంబర్ 24, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో విడుదల కానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడిన స్నాప్డ్రాగన్ 5G చిప్సెట్తో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ఏకైక స్మార్ట్ఫోన్ కానుంది.
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?

























