తన గురించి అభ్యంతరక వార్తలు, వీడియోలను ప్రచురించిన మీడియాకు సినీ నటి అషు రెడ్డి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాలను పాటించి తన గురించి రాసిన అన్ని రకాల కంటెంట్ను తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో ఉన్నత పాఠశాల సున్నాశాతం ఫలితాలను సాధించింది. ఈ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు ఉండగా ఆ నలుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పైగా, ఈ నలుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం గమనార్హం. చివరకు సున్నా శాతం ఫలితంతో అపకీర్తిని మూటగట్టుకుంది.