విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం, 1500 డిగ్రీల వేడితో మెటల్ లిక్విడ్, 9 మంది మృతి
విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంటులోని స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. పలువురికి గాయాలు అయ్యాయి.
1500 డిగ్రీల సెల్సియస్ వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని పైకి లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఉక్కు ద్రవం లీకైంది. ఈ భయంకర పేలుడుతో కార్మికులు తలో దిక్కున పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?
మృగశిర కార్తె అనగానే అందరికీ గుర్తొచ్చేది మృగశిర చేపలు. వాతావరణం హఠాత్తుగా వేడి నుండి చల్లదనానికి మారే క్రమంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో గుండె జబ్బులు, ఉబ్బసం (ఆస్తమా) వంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు పూర్వీకుల కాలం నుండి మృగశిర రోజున చేపలు తినడం ఒక ఆరోగ్యకరమైన ఆచారంగా వస్తోంది. హైదరాబాద్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో బత్తిన సోదరుల ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ కూడా ఈ కార్తె ప్రారంభం రోజే జరగడం విశేషం.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిseasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
పిల్లనిచ్చిన అత్త ప్రేమలో పడిన అల్లుడు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, వీడియో
పిల్లనిచ్చిన అత్తతోనే ప్రేమలో పడిపోయాడు ఆ అల్లుడు. తన భార్యను వదిలేసి అత్తతోనే కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఇది కాస్తా కుటుంబ సభ్యులకు తెలిసేలోపుగానే ఇద్దరూ పరారై కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన కాన్పూర్ దేహాత్లో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ అక్బరూర్ పరిధిలో ఓ అల్లుడు తరచూ అత్తగారింటికి వస్తున్నాడు. కట్టుకున్న భార్యను ఇంటివద్ద వదిలేసి అత్తారింటికి తరచూ వస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో అనుమానం మొదలైంది. వారి అనుమానాన్ని ఆ అత్తాఅల్లుళ్లు నిజం చేసారు. లోకం ఏమనుకుంటుందన్న విషయాన్ని కూడా పట్టించుకోని వారు ఇంటి నుంచి పారిపోయారు.
Sunitha: గాయని సునీత తనయుడు ఆకాష్ కు కొత్త మలుపు అవుతుందా..
ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా ద్వితీయ చిత్రంగా కొత్త మలుపు రూపొందింది. ఇటీవలే టీజర్ ను విడుదల చేశారు. భైరవి అర్ధ్యా హీరోయిన్. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. తాటి బాలకృష్ణ నిర్మాత. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్ను విడుదల చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
Ai+ Smartphone లాంచ్ను ఓపెన్ ట్రయల్గా మార్చింది
భారతీయ స్మార్ట్ఫోన్ పరిశ్రమలో తొలిసారిగా, Ai+ Smartphone నేడు ప్రకటించింది. విశ్వసనీయ వినియోగదారులకు విక్రయాలు ప్రారంభించే ముందే, భారతదేశం అంతటా ఉన్న సమీక్షకులు, కంటెంట్ నిర్మాతలు, పాత్రికేయులు, సాంకేతిక సమాజ సభ్యులకు తన రాబోయే Nova2 Neo, Nova2 Pro స్మార్ట్ఫోన్లను పంపిస్తుందని, ఎటువంటి పరిమితులు లేకుండా పరికరాలను విమర్శించి సమీక్షించడానికి. లాంచ్ ఈవెంట్ల చుట్టూ నిర్మించిన ఒక పరిశ్రమలో, Ai+ Smartphone భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటోంది. ప్రచారానికి ముందు సంభాషణ, విక్రయానికి ముందు అభిప్రాయం, మార్కెటింగ్కు ముందు వినియోగదారులు.
పవన్ కల్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?
























