మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు.
ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన సోమవారం నంద్యాల జిల్లాలోని కొత్త బురుజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను, విధ్వంసాన్ని సరి చేస్తున్నామన్నారు.