ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, నందిపాడు గ్రామంలో 400 మెగావాట్ల యుటిలిటీ-స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, ఇంజినీరింగ్, సామగ్రి సేకరణ, నిర్మాణం(ఈపీసీ) కోసం భారతదేశంలో బ్రూక్ఫీల్డ్ యొక్క పునరుత్పాదక ఇంధన వేదిక అయిన లుమారాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు యాక్సిస్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశలలో స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని అంచనా.
ఈ ప్రాజెక్టులో భాగంగా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్ యొక్క పూర్తి ఈపీసీ పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టడంతో పాటు, 400 కేవీ పూలింగ్ సబ్స్టేషన్, దానికి అనుబంధంగా ఉన్న 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ను కూడా అభివృద్ధి చేయనుంది.
కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వుండే పుణ్యభూమిగా కైలాస పర్వతగిరులని పురాణాల్లో చెప్పబడింది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సుల కోసం చేసే కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటిగా చెబుతారు. సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో, తీవ్రమైన వాతావరణ మార్పుల మధ్య కఠినమైన టిబెటన్ పీఠభూమిపై ఈ యాత్ర సాగుతుండటమే దీనికి ప్రధాన కారణం.
అత్యధిక ఎత్తులో వుండటంతో ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా వుంటుంది. ప్రాణవాయువు అందదు. ఎందుకంటే ఈ యాత్ర సముద్ర మట్టానికి దాదాపు 19,500 అడుగుల (5,900 మీటర్లు) ఎత్తు వరకు సాగుతుంది.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండిప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్గా, అందంగా కనిపిస్తారు.
చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది.
నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
పిన్ని పిన్నీ అంటూ తరచూ ఇంటికి వచ్చి ఆమెతోనే వివాహేతర సంబంధం, భర్త చూసేసరికి...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కొడుకు వరసయ్యే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత తన భర్తను హత్య చేయించింది. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అంకిరెడ్డిగూడెం గ్రామంలో రాపోలు దానయ్య, శారద దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం వుంటున్నారు. ఈ క్రమంలో దానయ్య సోదరడు కొడుకైన 19 ఏళ్ల శివ తరచూ వారి ఇంటికి వస్తున్నాడు. పిన్నిపిన్ని అంటూ శారదను పదేపదే కలిసేందుకు వచ్చేవాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దానయ్య పనికి వెళ్లినప్పుడు శివతో శారద ఏకాంతంగా గడిపేది.
Kayadu Lohar: రజనీకాంత్ పక్కనే కూర్చోవడం కలలా అనిపిస్తోంది : కయాదు లోహర్
విమానంలో రజనీకాంత్ తన పక్కనే కూర్చోవడాన్ని చూసి ఉప్పొంగిపోయిన కయాదు లోహర్: "ఇదంతా కలలా అనిపిస్తోంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విమానంలో సూపర్ స్టార్తో సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కయాదు లోహర్ వదులుకోలేదు. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
బోల్ట్ Ace 5G, Evoతో స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ప్రవేశం
ఫైర్-బోల్ట్ ఇంటి నుండి వచ్చిన హోమ్గ్రోన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ బోల్ట్ ఈరోజు తన మొదటి స్మార్ట్ఫోన్లు Ace 5G, Evo లాంచ్ను ప్రకటించింది, ఇది స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో బ్రాండ్ ప్రవేశాన్ని సూచిస్తుంది. ఆధునిక భారతీయ వినియోగదారుల కోసం డిజైన్ చేయబడిన ఈ స్మార్ట్ఫోన్లు దమదార్ పెర్ఫార్మెన్స్, AI-పవర్డ్ ఎక్స్పీరియన్స్, ఇమర్సివ్ డిస్ప్లే, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్ను ఒకచోట చేర్చాయి, రోజువారీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఫీచర్లపై ప్రత్యేక దృష్టితో.
Ace 5G, Evoలో 120Hz రిఫ్రెష్ రేట్తో పెద్ద 6.79-ఇంచ్ డిస్ప్లే ఇవ్వబడింది
APకి జగన్ ప్రతిపాదించిన MaViGun అనే రాజధానికి మీరు ఏకీభవిస్తున్నారా?
























