1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Leopard Sighting at Tirumala Causes Concern Among Devotees, officials alerted

శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్‌ వద్ద చిరుతపులి - అధికారులు అప్రమత్తం

Leopard
శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్ సమీపంలో చిరుతపులి కనిపించడంతో భక్తులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి ఈ ఘటన జరగడంతో సెక్యూరిటీ గార్డు భయంతో కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. వెంటనే అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్‌ అధికారులను అప్రమత్తం చేశారు. చిరుతపులి ఉనికిపై భక్తులు భయాందోళనలు వ్యక్తం చేశారు. 
 
గత సంవత్సరం ఆగస్టులో, అలిపిరి మార్గంలో ఒక చిరుతపులి ఒక చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆపై అటవీ శాఖ ఆరు చిరుతపులులు బంధించింది. తరువాత వాటిని జంతుప్రదర్శనశాలకు తరలించారు. 
 
తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు అనూహ్యంగా సంచరిస్తున్న నేపథ్యంలో ఇటీవల కనిపించిన దృశ్యం భక్తులు, అధికారులలో ఉద్రిక్తతను రేకెత్తించింది. భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసేందుకు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చిరుతపులిని గుర్తించే పనిలో పడ్డారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సైబరాబాద్ పోలీసులు సీరియస్.. శబ్ధ కాలుష్యం.. 17 పబ్‌లకు లైసెన్స్ లేదు..