సంబంధిత వార్తలు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం: సుస్థిర వ్యవసాయంపై రైతులకు హ్యుందాయ్ అయానిక్ ఫారెస్ట్ అవగాహన
- Varanasi: వారణాసి కథ కల్కి తరహాలో వుండే ఆసక్తికర కథనమా?
- నాగార్జునసాగర్ యలేశ్వర మల్లికార్జున స్వామిని దర్శించాలంటే.. పడవలో ప్రయాణించాల్సిందే..
- పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పులి.. 12 ఆవులు బలి.. పట్టుకునేందుకు అంతా సిద్ధం
- ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి
ఏలూరు వద్ద పెద్ద పులి సంచారం.. గోదవారిలో చేపల వేట, పర్యాటక బోట్లు రద్దు (video)
పోలవరం ప్రాంతం ఏలూరులో పెద్ద పులి సంచారంతో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరిలో చేపల వేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఎవరూ కూడా నది పరివాహక ప్రాంతాలలో చేపల వేటకు గాని పశువుల మేతకు తీసుకువెళ్లకూడదని వెళ్ళకూడదనీ, రైతులు, గ్రామస్తులు, పొలాలు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోనులను సిద్ధం చేశారు.
పోలవరం మండలంలోని తెల్లదిబ్బలు ప్రాంతానికి సమీపంలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, కాకిస్నూర్, టేకుపల్లి, కోయిదా, గుల్లమడుగు, టేకూరు, సిద్ధారం గ్రామాల ప్రజలు రాత్రిపూట ఒంటరిగా సంచరించరాదని, పశువులను అడవిలోనికి మేతకు తీసుకువెళ్లకూడదని, పశువుల కొట్టం నందు లైటింగ్ ఏర్పాటు చేసుకుని పశువులను ఇళ్ల వద్దే భద్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు.
ఏలూరు జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం..
— BIG TV Breaking News (@bigtvtelugu) June 23, 2026
ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరిలో చేపల వేట, పర్యాటక బోట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోనులను సిద్ధం చేశారు.… pic.twitter.com/ieUxFgbiOh
