1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tirupati Registers First Covid-19 Case

తిరుపతిలో కొత్త కోవిడ్ కేసు- 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్

Corona
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన సుదీర్ఘ కాలం తర్వాత, ఈ వారం తిరుపతిలో ఒక కొత్త కోవిడ్ కేసు నమోదైంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలు తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
వైద్యులు ఆమెకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె వయస్సు దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ