Indian Cookery

Notifications

  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ



గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)

గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)రాపిడో డ్రైవర్లుగా మహిళలు ప్రస్తుతం రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా రాపిడో డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. తాజాగా ఓ మహిళా రాపిడో డ్రైవర్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్ల దారి తప్పిన విదేశీ మహిళకు అండగా నిలిచిన మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు. చుట్టుపక్కల ఎవరూ లేక భయాందోళనకు గురవడంతో విదేశీ మహిళకు భరోసానిచ్చి ఆ విదేశీ మహిళను సురక్షితంగా హోటల్‌కు చేర్చిన సింధు అనే మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు కితాబిస్తూ పోస్టులు పెడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తనను రక్షించిన రాపిడో రైడర్‌పై విదేశీ మహిళ కూడా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

లెబనాన్‌లో స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి వైదొలగం.. కాట్జ్

చీరాల బీచ్‌లో 17ఏళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

చీరాల బీచ్‌లో 17ఏళ్ల బాలుడిని కాపాడిన పోలీసులుఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సమీపంలో ఉన్న ఓడరేవు బీచ్‌లో, భారీ అలల ధాటికి సముద్రపు ఉధృతమైన నీటిలో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలుడిని ఆంధ్ర మెరైన్ పోలీసులు ఆదివారం రక్షించారు. బీచ్‌లో ఈత కొడుతుండగా అఖిలేష్ అనే ఆ బాలుడు సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచేడు సబ్-ఇన్‌స్పెక్టర్ వెంటనే మెరైన్ పోలీసు బృందాన్ని అప్రమత్తం చేశారు. అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ, మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, స్థానిక ఈతగాళ్లు ఉధృతంగా ఉన్న సముద్రపు నీటిలోకి దూకారు. వారు ఆ బాలుడిని చేరుకుని, లైఫ్‌బాయ్ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఢిల్లీలో సేన ప్రస్థానం.. అధికారం కాదు.. ప్రజా సంక్షేమంపైనే దృష్టి.. పవన్ కల్యాణ్

ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు పిలుపు

ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు పిలుపుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.

ముంబైలో బుల్లితెర నటి సంచిత ఉగలే ఆత్మహత్య

Anirudh : అరవింద్ తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అనిరుద్‌ రవిచందర్