Vegetarian Food

Notifications

  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం



గుడ్ నైట్.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. భార్యకు మెరైన్ ఇంజనీర్ చివరి సందేశం

ప్రియుడితో జీవించేందుకు అడ్డుగా ఉన్న కుమార్తె... కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన తల్లి

ప్రియుడితో జీవించేందుకు అడ్డుగా ఉన్న కుమార్తె... కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన తల్లిబెంగుళూరులో ఓ దారుణం జరిగింది. కన్నబిడ్డను కసాయి తల్లి గొంతు నులిమి హత్య చేసింది. ప్రియుడుతో కలిసి జీవించేందుకు కుమార్తె అడ్డుగా ఉందని భావించిన కన్నతల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ వివరాలను పరిశీలిస్తే, దావణగెరెకు చెందిన ప్రవీణ్- ప్రియాంక 15 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. ప్రవీణ్ ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో తనతో కలిసి పాఠశాలలో చదువుకున్న మోహన్ ఆమెను మళ్లీ కలిశాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. క్రమంగా ఇద్దరూ మళ్లీ సన్నిహితమయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం విడదీయరానిదిగా మారింది. ఈ విషయాన్ని ప్రవీణ్ గుర్తించి, ఇద్దరినీ హెచ్చరించాడని పోలీసులు వివరించారు.

శ్రీవారి అభిషేక సేవలో అంబానీ ఫ్యామిలీ... సర్వదర్శనానికి 18 గంటలు (video)

శ్రీవారి అభిషేక సేవలో అంబానీ ఫ్యామిలీ... సర్వదర్శనానికి 18 గంటలు (video)భారతదేశ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సందర్శించుకున్నారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి అభిషేక సేవలో ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌లతో కలిసి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అంబానీ కుటుంబానికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం (టోకెన్లు లేని) భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కలగడానికి సుమారు 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది.

రూ.52 లక్షల మోసపోయిన లేడీ జడ్జి... పనిమనిషి పేరిట కేసు నమోదు

రూ.52 లక్షల మోసపోయిన లేడీ జడ్జి... పనిమనిషి పేరిట కేసు నమోదుహనీట్రాప్, సైబర్ మోసాలకు సామాన్యులే కాదు.. చట్టాన్ని రక్షించే న్యాయమూర్తులు సైతం బలైపోతున్నారు. హర్యానా రాష్ట్రంలో ఒక మహిళా న్యాయమూర్తి అడ్డంగా బుక్కయ్యారు. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్‌లో పరిచయమైన ఒక వ్యక్తి సదరు లేడీ జడ్జితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత నమ్మకంగా నటిస్తూ, క్రిప్టోకరెన్సీ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టుబడి పెడితే స్వల్ప కాలంలోనే భారీ లాభాలు వస్తాయంటూ ఆమెకు ఆశ చూపించాడు. అతని మాయమాటలను నిజమని నమ్మిన ఆమె, విడతల వారీగా ఏకంగా రూ.52 లక్షల భారీ మొత్తాన్ని అతనికి బదిలీ చేసింది. ఆ తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మోసపోయానని గ్రహించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.