మటన్ కూర బాగోలేదన్న భర్త... కొరివితో మూతి కాల్చిన భార్య...
మటన్ కూర బాలేదన్నందుకు ఓ భార్య కొరివితో కట్టుకున్న భర్త మూతిని కాల్చింది. దీంతో తీవ్ర గాయాలతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వరంగల్ నగరంలోని ఒక కాలనీలో నివాసం ఉండే దంపతులు మధ్య మంగళవారం రాత్రి భోజన సమయంలో ఈ ఘోరం జరిగింది. మటన్ కూర వండిన భార్య.. భర్తకు వడ్డించగా, అది బాలేదని భర్త అన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య సమీపంలోని నిప్పుల కొరివితో భర్త ముఖంపై కాల్చింది.
ఈ దాడిలో భర్త ముఖం, మెడ, చేతులు, తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
