1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Woman Murdered Before Husband In Sangareddy

సంగారెడ్డి జిల్లా దారుణం : మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి భర్త కళ్లముందే హత్య

Woman
సంగారెడ్డి జిల్లా దారుణం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా, ఐడీఏ బోలారం పోలీస్ పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, నలుగురు గుర్తుతెలియని దుండగులు ఒక మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి, ఆమె భర్త కళ్ల ముందే గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. బీహార్‌కు చెందిన దంపతులు అనిల్ కుమార్ (37), మీనా దేవి (35) శంతకులం వద్ద కూరగాయలు కొనుగోలు చేసి, వెంకటేశ్వర కాలనీలోని తమ ఇంటికి తిరిగి వెళ్తుండగా, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో గాందిగూడెం స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో వారి ద్విచక్ర వాహనం మొరాయించిందని పోలీసులు తెలిపారు.
 
చీకటి మాటున, పొదల్లో దాగి ఉన్న సాయుధులు ఆ బైక్‌ను అడ్డగించారు. వారిలో ఇద్దరు అనిల్‌ను బంధించగా, మిగిలినవారు మీనా దేవిని పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె సహాయం కోసం గట్టిగా అరచినప్పటికీ, ఒక దుండగుడు ఆమె చేతులను గట్టిగా పట్టుకోగా, మరొకడు ఆమెను హత్య చేశాడు. వారిని ప్రతిఘటించడానికి ప్రయత్నించిన అనిల్‌పై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారు. 
 
ఆ తర్వాత, దుండగులు తమ బైక్‌ల హెడ్‌లైట్లు ఆపివేసి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలోని ఒక పక్క దారి గుండా పారిపోయారు ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన అనిల్‌ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. 
 
ఈ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చారని, అనిల్ ఒక రోలర్ మిల్లులో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మీనా దేవికి తెలిసిన వ్యక్తులతో ఉన్న పాత కక్షలే ఈ నేరానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
About Writer
సెల్వి