1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. 6 Devotees Missing in Nallamala Forest in Ahobilam

అహోబిలం సమీపంలో దారి తప్పిన ఆరుగురు భక్తులు

Narasimha Avatar
నంద్యాల జిల్లాలోని అహోబిలం సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఆరుగురు భక్తులు అదృశ్యమయ్యారు. పావన నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు మొత్తం పది మంది భక్తులు వెళ్లారు. శ్రీ నరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా, వారిలో ఆరుగురు దారి తప్పిపోయారు.
 
అదృశ్యమైన వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు మరియు అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదృశ్యమైన భక్తులందరూ ప్రొద్దుటూరుకు చెందినవారిగా గుర్తించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి.. జగన్ పిలుపు