అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న ఎమ్మెల్యేలు.. సీరియస్ అయిన చంద్రబాబు
అసెంబ్లీకి లేటుగా వచ్చే ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ముగిసేలోపు శాసనసభ్యులు ఆలస్యంగా వచ్చి వెళ్లిపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక చర్చల సందర్భంగా, పలువురు సభ్యులు గైర్హాజరు కావడాన్ని సీఎం గమనించి, వారిపై సీరియస్ అయ్యారు.
అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో, అసెంబ్లీలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ముఖ్యమంత్రి పరిశీలన తర్వాత, విప్లు గైర్హాజరైన ఎమ్మెల్యేలను సంప్రదించగా, 17 మంది సభ్యులను వెంటనే పిలిపించారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో పూర్తిగా పాల్గొనేలా అన్ని ఎమ్మెల్యేలు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు.