శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (09:00 IST)

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

Duvvada Srinivas
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై వైకాపా అధిష్టానం సస్పెండ్ వేటువేసింది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఒకవైపు కుటుంబ కలహాలు, మరోవైపు, తన ప్రియురాలితో కలిసి బాహ్య ప్రపంచంలో చేయకూడని పనులు చేస్తూ ప్రధాన వార్తల్లో నిలిచారు. ఇవన్నీ వైకాపా అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. దీంతో ఆయననపై సస్పెండ్ వేటు వేసింది. 
 
దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తనను వ్యక్తిగత కారణాలతో అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసి మానసికక్షోభకు గురైనట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, ప్రతిపక్షాల మీదు విరుచుకుపడ్డానని తెలిపారు. అయితే, రాజకీయ క్రినీడలో బలైపోయానేమో అనిపిస్తుందన్నారు. 
 
తాను ఎపుడూ పార్టీకి ద్రోహం చేయలేదన్నారు. తప్పుడు పనులు చేయలేదని అన్నారు. స్వతంత్రుడినై తటస్థంగా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. తనకు ఈ హోదాను గౌరవాన్ని ఇచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు.