రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్
రైలు ప్రయాణంలో మహిళల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తానే ఓ మహిళను వేధించాడు. రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తే అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. కోచ్లో చీకటిగా ఉండటంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశ్యంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు. అయితే, నిద్ర నుంచి మేల్కొన్న ఆ మహిళ గట్టిగా పట్టుకుంది. కళ్లు తెరిచి చూడగా కానిస్టేబుల్ కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వివరాలను వెళితే, ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళుతున్న ట్రెయిన్లో మహిళల భద్రతను కాపాడిన జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా దారుణంగా ప్రవర్తించాడు. రాత్రి వేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. యువతి నిద్రలేచి పట్టుకోవడంతో క్షమించాలని వేడుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో ఉన్నతాధికారుల స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.