విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన
పౌర సేవలను అందించడంలో ఏఐని విజయవంతంగా అమలు చేసినందుకు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ప్రశంసించారు. త్వరలో విజయవాడలో కూడా ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెడతామని చెప్పారు. అక్టోబర్ 15-16 తేదీలలో అహ్మదాబాద్లో జరిగిన జాతీయ పట్టణ సమావేశం, మేయర్ సమ్మిట్లో మేయర్ పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, నగరాల భవిష్యత్తును రూపొందించడం అనే థీమ్తో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 110 మందికి పైగా మేయర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు
ఇందులో పట్టణ ఆవిష్కరణలు, స్థిరమైన అభివృద్ధి వివిధ నమూనాలను అన్వేషించారు. సబర్మతి నదీ తీర అభివృద్ధి, అహ్మదాబాద్ బీఆర్టీఎస్, మెట్రో వ్యవస్థలు, పౌర సేవల కోసం కృత్రిమ మేధస్సు వాడకం వంటి కీలక కార్యక్రమాల గురించి పాల్గొన్నవారు తెలుసుకున్నారని నగర మేయర్ చెప్పారు.