1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 జూన్ 2025 (12:09 IST)

అమ్మ ఇంకా బతికేవుంది.. వచ్చి చంపెయ్.. ప్రియుడుకి ప్రియురాలు పిలుపు

anjali
ప్రియుడు మోజులో పడిన ఓ బాలిక కన్నతల్లిని హత్య చేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో జరిగింది. ప్రియుడుతో వద్దన్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడు, అతడి సోదరుడితో తల్లిని హత్య చేయించింది. వారు ఇంట్లో తల్లిని హతమారుస్తుంటే నిందితురాలు బయట కాపలా కాసింది. అమ్మ కొనఊపిరితో కొట్టుమిట్టాడున్నా కనికరం చూపలేదు... అమ్మ ఇంకా బతికే వుంది వచ్చి చంపెయ్ అంటూ ప్రియుడిని ఇంటికి పిలిపించి కన్నతల్లికి మరణశాసన రాసింది. ఈ అమానుష ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. ఆమె ప్రియుడు సోదరుడు ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. 
 
పాలమూరు జిల్లా ఇనగుర్తి మండల కేంద్రానికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో కళాకారిణిగా పని చేస్తుంది. ఈమెకు 20 యేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో కలిగిన 15 యేళ్ళ కుమార్తె ఉంది. అతడు మృతి చెందడంతో రవి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె జన్మించగా, యేడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. 
 
ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెకు ఇన్‌స్టాఖాతచాలో నల్గొండ జిల్లా కట్టంగూర్‌కి చెందిన డీజీ నిర్వాహకుడు శివ (19) పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే, తమ ప్రేమ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె వారి ప్రేమకు నిరాకరించింది. దీంతో తల్లీకుమార్తెల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లిని చంపేద్దామని తన ప్రియుడుకి చెప్పింది. ఈ ప్రతిపాదనకు తొలుత నిరాకరించిన శివ... ఆ తర్వాత అంగీకరించాడు. 
 
తమ పథకంలో భాగంగా, ఈ నెల 19వ తేదీన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లి 20వ తేదీన జీడిమెట్ల పోలీసులకు తన కుమార్తె కిడ్నాప్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో ఆ బాలిక 20వ తేదీ రాత్రికి తిరిగి వచ్చి, తాము అనుకున్న పథకాన్ని 23వ తేదీన అమలు చేసింది. శివ, అతని సోదరుడు (17)లను ఇంటికి పిలిపించిన కుమార్తె మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తల్లి మెడకు చున్నీ బిగించగా, వారి మధ్య జరిగిన పెనుగులాటలో తలకు గాయమైంది. గొంతు బిగుసుకునిపోవడంతో ముక్కులోనుంచి రక్తం కారడంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. 
 
అంజలి చనిపోయిందని శివ సోదరులు ఇంటికి వెళ్లిపోయారు. ఇంతలో స్కూలు నుంచి ఇంటికి వచ్చింది. తల్లి అపస్మారకస్థితిలో ఉందని, ఆస్పత్రికి తీసుకెళదామని అక్కకు చెప్పగా, ఆమె స్పందించలేదు. పైగా, తన ప్రియుడుకి ఫోన్ చేసిన.. అమ్మ ఇంకా బతికేవుంది... వచ్చి చంపెయ్ అంటూ ప్రియుడుకి చెప్పింది. దీంతో శివ సోదరులు మళ్లీ ఇంటికి వచ్చి మెడకు చున్నీ బిగించి ఊపిరి ఆపేశారు. ఆ తర్వాత తన తల్లి చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుందంటూ బంధువులకు ఫోన్ చేసి చెప్పింది.
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే, పోలీసులు ఆ బాలిక ప్రవర్తనను అనుమానించిన పోలీసులు గట్టిగా విచారించగా అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో ఆ బాలికతో పాటు శివ సోదరులను  పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.