Damascus church: డమాస్కస్లోని చర్చిపై ఆత్మాహుతి బాంబర్ దాడి: 19మంది మృతి
సిరియా రాజధాని డమాస్కస్లోని చర్చిపై ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి బాంబర్ దాడి చేశాడు. ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనకు తానుగా పేలుడు పదార్థాలను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో కనీసం 19 మంది మృతి చెందారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని భద్రతా వర్గాలు, పర్యవేక్షణ బృందం తెలిపింది.
సిరియా ఆరోగ్య అధికారులు తాజా అధికారిక మరణాల సంఖ్యను 13గా ప్రకటించగా, మరో 53 మంది గాయపడ్డారని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
డమాస్కస్ తూర్పు శివార్లలో ప్రధానంగా క్రైస్తవులు నివసించే ద్వీలా జిల్లాలోని మార్ ఎలియాస్ చర్చిలో ఈ పేలుడు సంభవించింది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని పర్యవేక్షణ బృందం నివేదించింది. నేరస్తుడు ఇస్లామిక్ స్టేట్ (IS)తో అనుబంధం కలిగి ఉన్నాడని అంతర్గత భద్రతా విభాగం అధికారులు నిర్ధారించారు.