భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్
అమెరికా భారతదేశంలో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన $21 మిలియన్ల (₹182 కోట్లు) సహాయ ప్యాకేజీని రద్దు చేయాలన్న ప్రభుత్వ సామర్థ్యాల శాఖ (DGOE) నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, గణనీయమైన పన్ను ఆదాయాన్ని సృష్టిస్తోందని, అందువల్ల అమెరికా నుండి ఆర్థిక సహాయం అవసరం లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు.
"మనం భారతదేశానికి 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి? వారి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధించే దేశాలలో ఇది ఒకటి, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశం.. ఆ దేశపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఓటింగ్ పెంచడానికి 21 మిలియన్ డాలర్లు అందించాల్సిన అవసరం లేదు" అని ట్రంప్ అన్నారు.
ఈ నిధులను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ఈ నెల 16న ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డీజీఓఈ ప్రకటించింది. ఇది అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డబ్బును అటువంటి కార్యక్రమాలకు ఉపయోగించడంపై ఆందోళనలను ఉదహరించింది. భవిష్యత్తులో ఇలాంటి ఖర్చులన్నింటినీ రద్దు చేస్తామని ఏజెన్సీ పేర్కొంది.ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలో రాజకీయ చర్చకు దారితీసింది.