1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 16 జులై 2025 (11:10 IST)

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

Tabitha Bandreddy, Sukumar
Tabitha Bandreddy, Sukumar
పుష్ప 2 తర్వాత దర్శకుడు సుకుమార్ కొంత గేప్ తీసుకున్నాడు. కొంతకాలం రిలాక్స్ అయ్యాక పుష్ప 2 చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అందుకు తగిన కథఇంకా సెట్ కాకపోవడంతో హాలీవుడ్ స్థాయిలో ఓ కథను రెడీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం లండన్ వెళ్ళారు సుకుమార్. తన భార్య తబిత బండ్రెడ్డి తో వెళ్లి  ఫొటోను పోస్ట్ చేశారు. తన భార్యతో కలిసి లండన్‌లో జరిగే వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయ్యారు.
 
సహజంగా సబిత కాలేజీడేస్ లో వింబుల్డన్ గేమ్ ను ఆడేవారు. సుకుమార్ లైఫ్ లో వచ్చాక సినిమాలపై ఆమెకూడా ఆసక్తి కనబరిచారు. తన కుమార్తెతో ఇటీవలే గాంధీగారి చెట్టు అనే సినిమాకూడా చేశారు. రెండు రోజులక్రితమే ప్రీతి జింటా, అవ్నీత్ కౌర్ ఫైనల్స్‌కు హాజరయ్యారు; ఊర్వశి రౌతేలా నాలుగు లబుబు బొమ్మలతో పోజులిచ్చింది
 
కొన్ని వారాల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ ఓటమి నుండి త్వరగా కోలుకున్న జానిక్ సిన్నర్ వింబుల్డన్ 2025 పురుషుల ఫైనల్‌లో కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించడంతో, చాలా మంది భారతీయ ప్రముఖులు స్టాండ్స్‌లో హూ ఈజ్ హూలో చేరారు. 2025 వింబుల్డన్ ఫైనల్స్‌లో ప్రీతి జింటా, ఆమె భర్త జీన్ గూడెనఫ్, ఊర్వశి రౌతేలా,  అవనీత్ కౌర్ వంటి సినీ తారలు కనిపించారు. ఫర్హాన్ అక్తర్, అతని భార్య శిబానీ దండేకర్ వరుసగా మూడు రోజులు మ్యాచ్‌లను వీక్షించారు మరియు చివరి రోజున తండ్రి జావేద్ అక్తర్ కూడా వారితో చేరారు. ఇలా సినీప్రముఖులు కాస్త ఆటవిడుపు కోసం ఆటల్లో ఇలా ప్రత్యక్షమవుతుంటారు.