శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2025 (11:22 IST)

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

rape victim
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఏలూరులో రౌడీ షీటర్లు బరితెగించారు. ఇంట్లో ఒంటరిగా వున్న యువతిని అర్థరాత్రి లాక్కెళ్లారు. ఆపై ప్రభుత్వ కార్యాలయమైన సచివాలయంలోనే ఆమె అత్యాచారానికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరు టూటౌన్ పరిధిలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. 
 
స్నేహితురాలి కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లిన విషయాన్ని స్థానిక రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవాని కుమార్ పసిగట్టారు. ఇదే అదనుగా భావించి, అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, యువతిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. 
 
ఆపై యువతిని సమీపంలోని గ్రామ సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు