Noida: స్పృహ తప్పి పడిపోయింది.. కొన్ని క్షణాల్లో మృతి.. నా బిడ్డకు ఏమైందని తల్లి?
నోయిడాలోని ఒక పాఠశాలలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక విద్యార్థిని మరణం ఆమె తల్లిని కలచివేసింది. నోయిడాలోని ప్రెసిడియం స్కూల్లో చదువుతున్న తనిష్క శర్మ అనే అమ్మాయి పాఠశాలలో చేరిన కొద్ది క్షణాల్లోనే మరణించింది. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు కానీ తన బిడ్డ మరణానికి గల కారణాలు తెలియాలని ఆ తల్లి పోలీసులను డిమాండ్ చేసింది.
తనిష్క తల్లి సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. అది వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 4న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల కోసం తనిష్కను పాఠశాలకు పంపినట్లు ఆమె వీడియోలో షేర్ చేసింది. కానీ కొన్ని గంటల తర్వాత తన కుమార్తె స్పృహ కోల్పోయిందని ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
అయితే చివరి క్షణాల్లో తన బిడ్డతో వుండలేకపోయానని ఆమె తల్లి బోరున విలపించింది. తనిష్కకు చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలియాలని, ఆమెకు న్యాయం జరగాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.