రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?
బావమరదలు రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్ కి చెందిన సుధాకర్, రామంతాపూర్లోని గాంధీనగర్కు చెందిన పాసాల సుష్మిత ఇద్దరూ బావమరదలు అవుతారు. వీరిద్దరికీ పెళ్ళిళ్లు జరిగినా.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఇంట్లో తెలిసి మందలించి.. పోలీస్ కేసులు పెట్టినా మరదలు బావ దగ్గరకు వెళ్లిపోయింది.
గత రెండు రోజులుగా వీరిద్దరూ బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో బావ రంజిత్కు సుధాకర్ విషయం చెప్పాడు.
అయితే నెట్ ఆధారంగా రెస్టారెంట్కు చేరుకున్నా ఫలితం లేకపోయింది. అప్పటికే వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ చనిపోయేముందు 6 పేజీల నోట్ కూడా రాశారట. అయితే కుటుంబాలకు వీరి విషయం తెలియడంతో మొహం చూపించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.