1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జూన్ 2025 (11:47 IST)

సర్వేయర్‌తో తల్లీకుమార్తెల అక్రమ సంబంధం.. ఇంతలో పెళ్లి కుదిరింది.. ఆ వ్యక్తిని చంపేశారు..

love
అక్రమ సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకోకుండా ఇష్టమైన వారితో జీవిస్తే ఏ బాధ లేదు కానీ.. మహిళలు అక్రమ సంబంధాల కోసం ప్రస్తుతం హత్యలు చేసేందుకైనా వెనుకాడట్లేదు. మనసులో ఒకరిని పెట్టుకుని..మనువు మరోకరిని చేసుకుని మనసుపడ్డవాడితో మనువాడిని వాడిని హత్య చేస్తున్నారు. వారి ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి శాపంగా మారుతోంది. 
 
ఇలా ఒకటి రెండు కాదు..ఈ మధ్య జరుగుతున్న హత్యలన్నీ ఇలాంటివే.. మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. పెళ్లి చేసుకున్న పాపానికి ఆడవారి చేతిల అమాయకులు బలవుతున్నారు. అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య. 
 
పెళ్లయిన నెల రోజులకే భార్య తన తల్లితో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్‌ మేనేజర్‌తో కలిసి భర్తను హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది.
 
తిరుమలరావు అనే వ్యక్తి కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన, కల్లూరుకు చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. తరుచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐ-శ్వర్యతోనూ తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది.దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
 
ఐశ్వర్యకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్‌తో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్‌  ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్‌తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమలరావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు. దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 13న ఐశ్వర్య కనిపించకుండా పోయింది. 
 
అయితే పెళ్లి ఇష్టం లేని ఆమె బ్యాంక్‌ మేనేజర్‌తో లేచిపోయిందని అందరూ అనుకున్నారు.కానీ 16న తిరిగి వచ్చింది. పెళ్లికి ఓకే చెప్పింది. కానీ ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతోంది. 
 
దీంతో గంటల తరబడి అతనితో మాట్లాడుతుండేది. ఇది నచ్చని తేజేశ్వర్‌ మందలించాడు. ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అంతే తేజేశ్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావుతో కలిసి స్కెచ్ వేసి పొలం కొందామని తీసుకెళ్లి కారులోనే దాడి చేసి హత్య చేశారు. ఈ క్రమంలో తేజేశ్వర్‌ కనిపించకపోవడంతో  అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఐదు రోజులకు తేజేశ్వర్‌ మృతదేహం పోలీసులకు దొరికింది.
 
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఐశ్వర్య, సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ మేనేజర్‌ పరారీలో ఉన్నాడు. కాగాసుపారీ గ్యాంగ్‌లో కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.