పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఓజీ. గత నెల 25వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీలో ప్రత్యేక గీతాన్ని మంగళవారం రాత్రి నుంచి జోడించారు.
'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటూ సాగే ఈ గీతాన్ని మంగళవారం రాత్రి షో నుంచి అటాచ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ నేహాశెట్టి నర్తించింది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు ఈ పాట వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రూమర్స్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి ఈ పాటను తొలగించిన చిత్ర బృందం.. ఆ సర్ప్రైజ్ను ఇప్పుడు ఇచ్చింది. సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు టీమ్ మంగళవారం వెల్లడించింది.
అలాగే, బుధవారం సాయంత్రం చిత్ర విజయోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తాజాగా తెలిపింది. వేదిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఈవెంట్కు పవన్ కూడా హాజరుకానున్నారని సమాచారం.