అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ తన క్యాంపస్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపస్ నిర్మాణం కోసం మందడం, వెంకటపాలెం పరిధిలో 70 ఎకరాలను కేటాయించారు. తొలిదశలోనే సుమారు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో పనిచేసే స్మార్ట్ భవనాలు, ల్యాబులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో అంతా భూగర్భ విద్యుచ్ఛక్తి లైన్లు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టుతో నిర్మాణాలు చేయనున్నారు.