భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)
వివాహేతర సంబంధాలతో నేరాలు ఓవైపు పెరుగుతుంటే.. విచిత్ర ఘటనలు మరోవైపు జరుగుతున్నాయి. తాజాగా బీహార్లోని జాముయ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాట్నా నివాసి అయిన ఆయుషి, కొన్ని సంవత్సరాల క్రితం సిక్రియ గ్రామానికి చెందిన విశాల్ దుబేను వివాహం చేసుకుంది. ఇద్దరికీ మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే గత సంవత్సరం నుండి ఆయుషి తన భర్త మేనల్లుడు సచిన్తో ప్రేమలో పడింది. తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. దీంతో వారిద్దరి మధ్య సంబంధం మరింత పెరిగింది.
ఈ విషయం కాస్త ఆయుషి భర్త విశాల్ దూబేకు తెలిసింది. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు వెళ్లింది. విశాల్ దూబే విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశాడు. కానీ విడాకుల ప్రక్రియ పూర్తి కాకముందే ఆయుషి తన ప్రియుడు సచిన్ దూబేతో ఇంటి నుండి పారిపోయింది.
అనంతరం ఐదు రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చి గ్రామంలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆయుషి సంచలన విషయాలు చెప్పింది. తన భర్త తనను వేధించేవాడని చెప్పుకొచ్చింది. తన కుమార్తె తండ్రితోనే ఉంటుందని తెలిపింది.