గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (16:05 IST)

ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసిన వివాహిత

murder
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఓ మహిళ తన ప్రియుడి మాటలు విని నిద్రపోతున్న కన్నబిడ్డను తీసుకెళ్లి సరస్సులో పడేసింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలిగి తీసి విచారణ చేపట్టారు.  
 
ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పాప తల్లి అంజలీ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద విచారణ జరిపారు. ఈ విచారణలో భర్తను వదిలేసిన అంజలీ సింగ్... ఓ రెస్టారెంట్‌లో పని చేసే అఖిలేశ్‌తో కలిసి ఉంటోంది. బిడ్డ ఉండటంతో వారిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వీలు లేకుండా పోయింది. 
 
దీంతో పాప లేకుండా చూడాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి మాటలు విన్న కన్నతల్లి తన బిడ్డను రాత్రిపూట సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్పింది. ఆ తర్వాత ఆ బిడ్డ నిద్రపోవడంతో నీటి సరసులో పడేసి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళినట్టు పోలీసుల విచారణలో వెల్లడించింది.