జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారి పక్కనే 66 గజాల స్థలం కలిగి వున్న ఓ యజమానికి బంపర్ ఆలోచన వచ్చింది. తన ఇంటి స్థలాన్ని అమ్మేందుకు గత ఏడాదిగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అనుకున్న ధర రావడంలేదు. దీనితో లక్కీడ్రా పద్ధతిని ప్రవేశపెట్టారాయన. ఇందుకుగాను రూ. 500 విలువైన 3000 కూపన్లు ముద్రించాడు.
ఈ 3 వేల కూపన్లను కొనుగోలు చేసి తను ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని బోర్డు పెట్టాడు. కూపన్లు అన్నీ కొనుగోలు పూర్తయ్యాక నవంబరు నెలలో లక్కీ డ్రా తీస్తానని చెబుతున్నాడు. ఇది చట్టబద్ధం కానప్పటికీ ఇతడి ఆలోచన చాలా కొత్తగా వుందని పలువురు చెప్పుకుంటున్నారు. జస్ట్ 500 రూపాయలతో లక్ తగిలితే రూ. 15 లక్షల ఆస్తి తగలవచ్చు కనుక పలువురు ఆ డబ్బాలో కూపన్లు వేసే పనిలో వున్నారట.