మంగళవారం, 14 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2025 (13:54 IST)

తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త... దీపావళి కానుక PMKSY నిధులు విడుదల

Farmers
రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 21వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా  కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు 20 విడతల్లో నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడుత నిధులను విడుదల చేయడానికి  సిద్ధమైంది. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రూ.171 కోట్ల తక్షణ సహాయం కింద జమ్మూ కాశ్మీర్‌లోని వరద బాధిత రైతులకు అందాయి. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది రైతులకు తక్షణ సాయంగా ఈ నిధి ఉపకరిస్తుంది. 
 
అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా  అతి త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 21వ విడుత నిధులు విడుదల కానున్నాయి. అయితే ఈ నిధులు వీలయితే దీపావళి ముందుగానే లేకపోతే అక్టోబర్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. 
 
ఇక రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ముందుగానే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ప్రతి ఏడాది రూ.6000 కాగా వీటిని నాలుగు నెలలకు ఒకసారి మూడు దఫాల్లో విడుదల చేస్తారు.  ఈ ఏడాది చివరి దఫా నిధులు ఈ నెలలో విడుదల కానున్నాయి.